ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్‌ విజయం

ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆసియా- ఫసిపిక్‌ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా భారత్‌ విజయం సాధించి..యూఎన్‌ఎస్‌సీకి ఎనిమిదోసారి ఎన్నికైంది. ..

Updated : 18 Jun 2020 11:06 IST

దిల్లీ: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆసియా- ఫసిపిక్‌ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా మరోసారి  గెలుపొంది..యూఎన్‌స్సీకి ఎనిమిదోసారి ఎన్నికైంది. మొత్తం 193 సభ్యదేశాలున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటు వేశాయి.  ఈ మేరకు ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌. తిరుమూర్తి వెల్లడించారు. 2021-22 కాలానికి అధిక మద్దతుతో భారత్‌ను  ఐరాస సభ్యదేశాలు ఎన్నుకున్నాయని తెలిపారు. మొత్తం 192 ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184 ఓట్లు లభించాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని