లెహ్లో ఎగిరిన యుద్ధ విమానం
భారత్, చైనా మధ్య ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది! చైనీయుల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. సైన్యానికి తోడుగా భారతీయ వాయుసేన సైతం అత్యంత అప్రమత్తమైంది. కీలకమైన తూర్పు లద్దాక్ ప్రాంతంలోకి తన ఆయుధ సంపత్తిని తరలించింది....
సైన్యానికి సాయంగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరింపు
లెహ్, లద్దాఖ్లో భారత వాయుసేన అధినేత పర్యటన
ఇంటర్నెట్డెస్క్: భారత్, చైనా మధ్య ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది! చైనీయుల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. సైన్యానికి తోడుగా భారతీయ వాయుసేన సైతం అత్యంత అప్రమత్తమైంది. కీలకమైన తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి తన ఆయుధ సంపత్తిని తరలించింది.
భారత అధీనంలోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక హెలికాప్టర్ల సంచారం సర్వ సాధారణమే. అయితే శుక్రవారం లెహ్ పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా రెండు రోజుల పర్యటన కోసం లెహ్, శ్రీనగర్ వాయుసేన శిబిరాలకు రావడం గమనార్హం. చైనాతో వివాదం నేపథ్యంలో సరిహద్దుల్లోని వాయుసేన శిబిరాలు, ఎయిర్ఫీల్డ్స్కు తన సామగ్రిని తరలించింది.
‘వాయుసేన అధినేత రెండు రోజుల పర్యటనకు వచ్చారు. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వాయుసేన సన్నద్ధతను ఆయన పరిశీలించారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా 10వేల మందికి పైగా సైనికులను మోహరించిన సంగతి తెలిసిందే’ అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇదే విషయాన్ని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి, వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నందిని అడగ్గా ‘నో కామెంట్స్’ అనడం గమనార్హం.
భదౌరియా జూన్17న లెహ్లో పర్యటించారు. అక్కడి నుంచి జూన్18న శ్రీనగర్ వాయుసేన శిబిరానికి వెళ్లారు. ఈ రెండు శిబిరాలు తూర్పు లద్దాఖ్కు సమీపంలో ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో యుద్ధ విమానాల సేవలకు అనువుగా ఉంటాయి. అంతేకాకుండా చైనాపై ఆధిపత్యం చెలాయించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుందని అభిజ్ఞవర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా అతి తక్కువ సమయంలోనే ఎగిరేలా సుఖోయ్ 30ఎంకేఐ, మిరేజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్ ముందుకు తరలించింది. భారత సైన్యానికి సాయం అందించేందుకు దాడి సామర్థ్యమున్న అమెరికన్ అపాచీ హెలికాప్టర్లను సైతం మోహరించింది. లెహ్ శిబిరానికి సమీపంలో చినూక్ హెలికాప్టర్లనూ మోహరించడం గమనార్హం.
సైనికులకు అనుకూలంగా ఎంఐ-17వీ5 మీడియం లిఫ్ట్ ఛాపర్లను నియోగించింది. లద్దాఖ్, టిబెట్, అదమ్పుర్, హల్వారా, అంబాలా, సిర్సా శిబిరాల వద్ద ఐఏఎఫ్కు చైనాపై ఆధిపత్యం ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా భారత అధీనంలోని లద్దాఖ్ సమీప ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు ఎగిరేందుకు ప్రయత్నించడంతో హోతన్, గార్ గున్సా వద్ద 14,000 అడుగుల ఎత్తున భారత వాయుసేన ఎస్యు-30 యుద్ధ విమానాలను మోహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు