కోలుకుంటున్న దిల్లీ ఆరోగ్య మంత్రి

కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిల్లీ ఆరోగ్యమంత్రి.......

Published : 21 Jun 2020 17:42 IST

దిల్లీ: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్‌ జైన్‌ కోలుకుంటున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు నిన్న ప్లాస్మా థెరపీ చికిత్స అందించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని.. సోమవారం జనరల్‌ వార్డుకు మార్చే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సత్యేందర్‌జైన్‌ రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

గత బుధవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని