జేకేలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, తీవ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులతో పాటు ఒక సీఆర్పీఎఫ్‌...

Updated : 23 Jun 2020 12:06 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను అమరుడైయ్యారు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్‌, 182 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు కూడా షూటింగ్‌ ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్‌ మృతిచెందారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. అక్కడ కొన్ని తుపాకులతో పాటు బులెట్లు, మందుగుండు సామాగ్రి దొరికినట్లు ఆయన తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని