గల్వాన్ వీరులకు ప్రశంస బ్యాడ్జీలు
తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ఘటన తర్వతా భారత సైన్యాధిపతి జనరల్ ఎం. ఎం. నరవణే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.....
బహూకరించిన భారత సైన్యాధిపతి
లద్దాఖ్: తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ఘటన తర్వతా భారత సైన్యాధిపతి జనరల్ ఎం. ఎం. నర్వణే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి లేహ్లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఆయన మంగళవారం పరామర్శించారు. తాజాగా ఆయన చైనాతో ఘర్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లను ప్రశంసించి వారికి ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని వారిని ప్రోత్సహించారని భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలానే అక్కడి పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్ష జరిపారని పేర్కొంది.
ఈ నెల 15 తేదీన చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసింది. ఈ ఘర్షణలో 70 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో నెలకొన్న తీవ్రతలను తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఘర్షణకు కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకారం జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!