ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌ చొహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి........

Updated : 29 Jun 2020 10:14 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌ చొహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సాయుధ బలగాల సాయంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు. సంఘటనా స్థలంలో ఓ ఏకే-47తో పాటు రెండు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఏ ఉగ్రసంస్థకు చెందినవారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని