ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా వాఘామా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది........

Published : 30 Jun 2020 10:21 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా వాఘామా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు సాయుధ బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తమపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులపై దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో ఈ జిల్లాలో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. నిన్న జరిగిన కాల్పుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని