ఒళ్లునొప్పులు, వికారం వంటి సమస్యలు కూడా..
కొవిడ్-19ను ముందుగా గుర్తించడానికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాల మీద ఆధారపడితే సరిపోదని తెలుస్తోంది.
కొవిడ్ లక్షణాల జాబితాలో
ముంబయి: కొవిడ్-19ను ముందుగా గుర్తించడానికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాల మీద ఆధారపడితే సరిపోదని నిపుణులు అంటున్నారు. కరోనా బాధితుల్లో వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. కొందరిలో డయేరియా సమస్య ఊహించినదానికంటే అధికంగా ఉందన్నారు. ‘ఒళ్లు నొప్పులు వంటి అసాధారణ లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొంతమందికి కాలు కింది భాగంలో నొప్పి మినహా మరే లక్షణాలు ఉండటం లేదు’ అని కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందంలోని సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు. నిర్ధారణ పరీక్షలకు ముందు 200 మంది కొవిడ్ అనుమానితులకు చికిత్స అందించిన సీనియర్ వైద్యులు జలీల్ పార్కర్ మాట్లాడుతూ..వారిలో చాలామంది వెన్నునొప్పితో బాధపడ్డారని వెల్లడించారు. తరవాత వారికి కరోనా పాజిటివ్గా తేలింది.
కొవిడ్ రోగులు వికారంతో బాధపడటడం సర్వసాధారణ సమస్యగా ఉందని టాస్క్ఫోర్స్లో మరో సభ్యుడు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఓం శ్రీవాస్తవ అన్నారు. ‘ఒళ్లు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొద్దిపాటి జ్వరం కూడా కొవిడ్ లక్షణంగా కనిపిస్తోంది’ అని గ్రాంట్ మెడికల్ కాలేజ్కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ హేమంత్ గుప్తా వెల్లడించారు. చక్కెర స్థాయులు అదుపుతప్పడం కూడా వైద్యులకు ఒక చిహ్నంగా భావిస్తున్నారు. వారికి అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం వస్తోందని తెలిపారు. దద్దుర్లు, దురద వంటి లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్లు వాక్హార్డ్ ఆసుపత్రులకు చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు.
కాగా, సోమవారం అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) ముక్కు కారడం, వికారం లేక వాంతులు, నీళ్ల విరేచనాలను కొవిడ్ లక్షణాల జాబితాలో కొత్తగా చేర్చింది. ఇటీవల ఐసీఎంఆర్ కూడా రుచి, వాసనను కోల్పోవడం వంటి లక్షణాలను ఈ జాబితాలో చేర్చింది. జ్వరం, పొడిదగ్గు, అలసట సహజంగా కనిపించే లక్షణాలు కాగా..వీటికి అదనంగా కొత్తగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
ఇవీ చదవండి:
రోజుకి లక్ష కేసులు నమోదవ్వొచ్చు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..