మయన్మార్‌లో ఘోరం: 113 మంది మృతి

మయన్మార్‌లోని కాచిన్‌ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. జాడె అనే ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మంది కార్మికులు..

Updated : 02 Jul 2020 16:27 IST

కాచిన్‌: మయన్మార్‌లోని కాచిన్‌ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. జాడె అనే ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మంది కార్మికులు మృతిచెందారు. వందలాది మంది గనుల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కొండచరియల కింద మరికొందరు చిక్కుకోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాచిన్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని