మహారాష్ట్రలో కరోనా.. లక్షకు పైనే రికవరీ!

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా విలయం కొనసాగుతుంటే.. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యా పెరగడం ఉపశమనం కలిగిస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు ...

Published : 03 Jul 2020 01:05 IST

ముంబయి: మహారాష్ట్రలో ఓ వైపు కరోనా విలయం కొనసాగుతుంటే.. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యా పెరగడం ఉపశమనం కలిగిస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదువుతున్న మహారాష్ట్రలో గత 24గంటల్లో 6330 కేసులు, 125 మరణాలు నమోదు కాగా.. 8081మంది కోలుకున్నారు. తాజాగా వచ్చిన కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,626కి చేరగా మరణాల సంఖ్య 8178గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 77260 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 54.21%గా ఉంది.

ముంబయిలో 80వేలు దాటాయ్‌..
దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిని కొవిడ్‌ మహమ్మారి వణికిస్తోంది. తాజాగా 1554 కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 80699గా ఉండగా.. 4689మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో 50691మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 25311గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని