మీ వీరత్వంతో దేశం గర్వపడుతోంది
గల్వాన్ వ్యాలీలో చైనాతో ఘర్షణలో గాయపడ్డ వీర సైనికులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కలుసుకున్నారు. మీ పరాక్రమంతో 130 కోట్ల ప్రజలు..
గాయపడ్డ సైనికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
దిల్లీ: గల్వాన్ వ్యాలీలో చైనాతో ఘర్షణలో గాయపడ్డ వీర సైనికులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కలుసుకున్నారు. మీ పరాక్రమంతో 130 కోట్ల ప్రజలు గర్వపడేలా చేశారని వారిని కొనియాడారు. లద్దాఖ్లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని లేహ్కు చేరుకొని అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను కలిసి మాట్లాడారు. ‘మీ త్యాగాలకు కృతజ్ఞత చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను. ప్రపంచంలోని ఏ శక్తికీ భారత్ తలొగ్గలేదు. మీలాంటి వీర సైనికులు ఉన్నంతకాలం అలా జరిగే అవకాశమే లేదు. మీకు, మిమ్మల్ని కన్న తల్లులకు, మీలాంటి పోరాటయోధులను అందించిన ఈ భరతమాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని మోదీ సైనికులతో ముచ్చటించారు.
‘మీరు ఆసుపత్రిలో ఉండటం వల్ల మీకు తెలియకపోవచ్చు. 130 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు. శత్రువులకు మీరు తగిన గుణపాఠం చెప్పారు. మీ వీరత్వంపై ప్రపంచమంతా చర్చించుకుంటోంది. మీ పరాక్రమం గురించి తెలుసుకోవాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీ త్యాగాలను కొనియాడుతోంది. మీ ధైర్యం, మీరు చిందించిన రక్తం యువతకీ, ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినందిస్తోంది’ అని ప్రధాని గాయపడ్డ సైనికులతో అన్నారు.
అంతకుముందు ప్రధాని లద్దాఖ్లో ఆకస్మిక పర్యటన చేశారు. సరిహద్దు పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం జూన్ 15న చైనా దాడిని తిప్పికొట్టిన వీర సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె