ముంబయిలో రెడ్ అలెర్ట్!
మహారాష్ట్రలోని ముంబయి, థానే, రత్నగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబయిలో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి........
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు: ఐఎండీ
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి, థానే, రత్నగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబయిలో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ముంబయి పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్గఢ్, ముంబయి, రత్నగిరి, రాయ్గఢ్, థానేలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబయి మహానగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 161.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సముద్రంలో అలలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రజవెవరూ తీరంవైపు వెళ్లొద్దని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.