రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత
బంగారం స్మగ్లింగ్ భారీ కుంభకోణం బయపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన కంజైన్మెంట్లో..
తిరువనంతపురం: బంగారం స్మగ్లింగ్ భారీ కుంభకోణం బయపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన కన్సైన్మెంట్ నుంచి దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్యకాలంలో ఇంత మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారులు పేర్కొంటున్నారు. స్మగ్లింగ్పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొంది తనిఖీలు చేసింది. ‘నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారంతోనే దాడులు చేశాం. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా బంగారం బయటపడే అవకాశం ఉంది’ అని కేరళ, లక్షద్వీప్ ప్రాంత కస్టమ్స్ ఇన్ఛార్జి కమిషనర్ సుమిత్ కుమార్ తెలిపారు.
కన్సైన్మెంట్ ఓ ఛార్టెడ్ విమానం ద్వారా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంది. కన్సైన్మెంట్లకు సాధారణంగా ఎలాంటి తనిఖీలు నిర్వహించరు. స్మగ్లింగ్ సిండికేట్ దీనినే అదునుగా భావించి కొంతమంది దిగువ స్థాయి ఉద్యోగులను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటోందని కస్టమ్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పట్టుబడ్డ బంగారం విలువ రూ.కోట్లలో ఉంటుందని గృహోపకరణాల మధ్య దాచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. తనిఖీ చేయాల్సి సరుకు ఇంకా ఉందని మరింత బంగారం బయపటపడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
దేశీయంగా పసిడి ధర ఆకాశాన్నంటడంతో స్మగ్లింగ్ భూతం రెక్కలు విచ్చుకుంది. తూర్పు మధ్య దేశాలనుంచి వచ్చిన ఛార్టెడ్ విమానాల నుంచి గత రెండు వారాల్లోనే 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!