పుల్వామాలో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం

జమ్మూ-క‌శ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ  ప్రాంతంలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు..........

Published : 07 Jul 2020 13:16 IST

శ్రీనగర్‌: జమ్మూ-క‌శ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ  ప్రాంతంలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.  అలాగే పోలీసు సహా ఇద్దరు సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదులు దాగి ఉన్నా‌రన్న స‌మాచారంతో పోలీసులు, భద్రతా దళాలతో కలిసి గుసూ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బలగాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులు జ‌రిపారు. ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలిపారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా తీవ్రంగా గాయపడి ఉంటారని భావిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని