'హెర్డ్ ఇమ్యూనిటీ'పై స్పెయిన్ ఏమన్నదంటే..!
విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారా ఈవైరస్ నుంచి విముక్తి పొందవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేదని స్పెయిన్ పరిశోధనల్లో వెల్లడైంది.
70వేల మందిపై పరిశోధన అనంతరం నివేదిక
మాడ్రిడ్: విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారా ఈవైరస్ నుంచి విముక్తి పొందవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేదని స్పెయిన్ పరిశోధనల్లో వెల్లడైంది. అక్కడి జనాభాలో కేవలం 5శాతం ప్రజల్లో మాత్రమే కరోనా వైరస్ యాంటీబాడీస్ వృద్ధిచెందినట్లు నిరూపితమైంది.
జనాభాలో ఎక్కువ మంది వైరస్ను తట్టుకునే శక్తిని కలిగి ఉండటాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్యవహరిస్తారు. ఈ శక్తిని సాధించాలంటే జనాభాలో కనీసం 60శాతం మంది వైరస్ నుంచి కోలుకొని ఉండటమో లేదా వ్యాక్సిన్ ద్వారా సాధించడమో జరగాలని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, కరోనా మహమ్మారి ధాటికి వణికిపోయిన స్పెయిన్ హెర్డ్ ఇమ్యూనిటీని తెలుసుకునేందుకు భారీ స్థాయిలో యాంటీబాడీల పరిశోధనలు చేపట్టింది. గడిచిన మూడు నెలల్లో అక్కడ దాదాపు 70వేల మందిని మూడుసార్లు పరీక్షించింది. ఈ మూడు నెలల కాలంలో వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పు కనిపించలేదని కనుగొంది. వైరస్ను ఎదుర్కొనే శక్తి స్వల్పకాలమేనని.. పరిశోధనల్లో పాల్గొన్న వారిలో దాదాపు 14శాతం మందికి తొలుత యాంటీబాడీస్ ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో వారు ఆ శక్తి కోల్పోయినట్లు తేలింది. రోగనిరోధక శక్తి తాత్కాలికంగా ఉండడంతోపాటు కొంతకాలానికి అది పూర్తిగా అదృశ్యం అయ్యే అవకాశం కూడా ఉందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ రాక్వెల్ యొట్టి స్పష్టంచేశారు. ఇప్పటివరకు స్పెయిన్లో 5.2శాతం మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. మిగతా 95శాతం ప్రజలు ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో స్పెయిన్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండడంతోపాటు సాధ్యమైనంతవరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
హెర్డ్ ఇమ్యూనిటీపై కొనసాగుతున్న పరిశోధనలు..
వైరస్ను తట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిపై పలుదేశాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కవ జనాభాకు వైరస్ సోకడం ద్వారా వైరస్ ప్రాభల్యంలో మార్పును అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, చైనాల్లో దీనిపై విస్తృతంగా పరీక్షలు జరుపుతున్నారు. వైరస్ సహజ సంక్రమణ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తామనే ప్రతిపాదనలు అనైతికం కానప్పటికీ, ఇవి అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివిధ దేశాల్లో జరుగుతున్న తాజా పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ప్రముఖ వైరాలజస్ట్ ఇసబెల్లా ఎకెర్లే స్పష్టం చేశారు.
శరీరంలో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన వారు మళ్లీ వైరస్ బారినపడరనే విషయంపై ఇంకా వైద్యుల్లోనే అనిశ్చితి నెలకొంది. అంతేకాకుండా వైరస్ నుంచి యాంటీబాడీలు ఎంతవరకు రక్షిస్తాయనే విషయంపైనా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, స్సెయిన్లో ఇప్పటివరకు 2,98,869 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటివరకు 28వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి..
మహమ్మారి ముప్పు ఇప్పట్లో ముగిసిపోదు..
రోగనిరోధక శక్తి తగ్గుదల లక్షణాలివే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం