‘‘లద్దాఖ్లో ఎలాంటి సవాళ్లకయినా సిద్ధం’’
భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్...
భారతీయ వాయుసేన
లద్దాఖ్: భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా బలగాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులను దృష్టిలో ఉంచుకొని భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ మేరకు లద్దాఖ్ ప్రాంతంలో భారత్ వాయుసేన రాత్రి పగలుతో పాటు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా యుద్ధ సన్నద్ధతపై అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు, యుద్ధ హెలికాఫ్టర్లు, మల్టీ మిషన్ చాపర్లు వంటి వాటిని అక్కడి ఎయిర్బేస్ నుంచి రాత్రి సమయాల్లో కూడా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారతీయ వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిగ్-29 ఫైటర్ జెట్లు, సుఖోయ్-30ఎస్ విమానాలు, అపాచీ ఏహెచ్-64ఈ యుద్ధ హెలికాఫ్టర్లు, సీహెచ్-47ఎఫ్ (ఐ) చినూక్ మల్టీ మిషన్ హెలికాఫ్టర్లు వంటి వాటిని లద్దాఖ్ పర్వతశ్రేణుల్లో వాయుసేన మోహరించింది. దీని ద్వారా భారత్కు తగిన సామర్ధ్యం ఉందని, అవసరమైనప్పుడు బదులిచ్చే సత్తా తమకుందనే సందేశాన్ని డ్రాగన్ దేశానికి పంపడం దీని ముఖ్య ఉద్దేశం అని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘గతంలో పర్వత ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీకి కొన్ని పరిమితులు ఉండేవి. ప్రస్తుతం వాటన్నింటినీ అధిగమించాం. లద్దాఖ్లో రాత్రిపూట వాయుసేన కార్యకలాపాలు చేపట్టడం ఐఏఎఫ్ శిక్షణలో భాగం. దీని ద్వారా పైలెట్లు, ఇతర సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు’’ అని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ తెలిపారు.
ఇరు దేశాల ముఖ్య నాయకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు చైనా తన బలగాలను వెనక్కు పిలిచిన నేపథ్యంలో భారత్ సైన్యం సరిహద్దు గస్తీని మరింత మెరుగుపరిచి అప్రమత్తంగా ఉంది. ఒక వేళ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు దిగితే దీటుగా బదులిచ్చేందుకే లద్దాఖ్లోని ఎయిర్బేస్లు హైఅలర్ట్లో ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. గల్వాన్ ఘటన తర్వాత సైనికులను లద్దాఖ్కు తరలించడంలో వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ 3, సీ130జే సూపర్ హెర్క్యూలిస్ విమానాలు కీలకపాత్ర పోషించాయని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా అపాచీ, చినూక్ మల్టీ మిషన్ హెలికాఫ్టర్లలో మార్పులు చేశారు. దానితో పాటు రూ.38,900 కోట్లతో 33 కొత్త యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.