ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ మృతి

బిహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు..........

Published : 10 Jul 2020 11:04 IST

పశ్చిమ చంపరన్‌: బిహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఆపరేషన్‌లో బిహార్‌ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) బలగాలు పాల్గొన్నాయి. సంఘటనా స్థలంలో మూడు అత్యాధునిక తుపాకులు, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని