నేపాల్‌: కొండ‌చరియ‌లు విరిగిప‌డి 44మంది గ‌ల్లంతు!

నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి క‌స్కీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొండ‌చెరియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టికే 12మంది మృతిచెందగా మ‌రో 19మంది వాటిలో చిక్కుకుపోయిన‌ట్లు అక్క‌డి పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున కురిసిన భారీ వ‌ర్షాల‌కు కొండ‌చెరియ‌లు విరిగి నివాస స్థ‌లాల‌పై ప‌డ‌డంతో చాలా ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో చాలామంది వాటికింద‌  చిక్కుకుపోయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌రకు 44మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించామ‌ని, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Published : 11 Jul 2020 00:10 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి క‌స్కీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొండ‌చరియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టికే 12మంది మృతిచెందగా మ‌రో 19మంది వాటిలో చిక్కుకుపోయిన‌ట్లు అక్క‌డి పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున కురిసిన భారీ వ‌ర్షాల‌కు కొండచరియ‌లు విరిగి నివాస స్థ‌లాల‌పై ప‌డ‌డంతో చాలా ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో చాలామంది వాటికింద‌  చిక్కుకుపోయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌రకు 44మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించామ‌ని, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. శిథిలాల మ‌ధ్య గాలింపు చ‌ర్య‌లను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా పొఖారా ప‌ట్ట‌ణానికి స‌మీపంలోని సారంగ్‌కోట్‌, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువ‌గా కొండ‌చరియ‌లు విరిగి ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండ‌చరియ‌లు విరిగిప‌డిన‌ ఘ‌ట‌న‌ల్లో మ‌రో 12మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అన్ని ప్రాంతాల్లోనూ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు