చైనాకు బయలుదేరిన WHO నిపుణుల బృందం!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై పూర్తి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ..
తొలుత ఇద్దరు నిపుణులు చైనాకు..
పూర్తి దర్యాప్తు బృందంపై కసరత్తు - డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై పూర్తి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ముందస్తు నిపుణుల బృందం చైనాకు బయలుదేరింది. ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో ఓ మాంసహార విక్రయశాలలో బయటపడినట్లు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ మూలాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం ఇక పూర్తి దర్యాప్తు చేయనుంది.
‘‘జంతు ఆరోగ్యం, ఎపిడెమియాలజీలో నిష్ణాతులైన ఇద్దరు డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం నేడు చైనా బయలుదేరింది. తొలుత వీరు దర్యాప్తు పరిధితోపాటు పరిశోధనకు పట్టే సమయాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి అంచనా వేస్తారు. అంతేగాకుండా పూర్తి బృందంలో ఎంతమంది పాల్గొనాలి? ఎలాంటి నైపుణ్యాలు ఉన్నవారు ఈ పరిశోధనలో పాల్గొనాలి? అనే దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు’’ అని డబ్ల్యూహెచ్వో అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన ఈ స్వతంత్ర దర్యాప్తు బృందంలో డబ్ల్యూహెచ్వో పాత్ర ఉండదని మార్గరెట్ హారిస్ స్పష్టం చేశారు.
‘‘కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ ఉద్భవించిందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అది తెలుసుకునేందుకే జంతు ఆరోగ్య నిపుణుడిని పంపిస్తున్నాం. ఈ వైరస్ జంతు జాతుల నుంచి మానవులకు సోకిందా? ఏ జాతుల నుంచి సోకిందనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా గబ్బిలాల్లో కనిపించే వైరస్తో పోలికలున్న ఈ వైరస్ మధ్యంతర జాతుల నుంచి మానవులకు ఎలా సంక్రమించిందనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది’’ అని మార్గరెట్ హారిస్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి వుహాన్లోని ల్యాబ్లో సృష్టించారని అమెరికా పలుసార్లు ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ అమెరికా అధికారులు ప్రకటించారు. వీటికితోడు ఈ కరోనా మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని చాలాదేశాలు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు సిద్ధమైంది.
ఇవీ చదవండి..
వుహాన్ లేబొరేటరీలో ఏం జరిగింది?
చైనా వంచన విధానమే ప్రపంచాన్ని ముంచింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!