ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!

ఇప్పటి వరకు మనం ప్రేమ పెళ్లిలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిల గురించి మాత్రమే విని ఉంటాం. కానీ ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయి...

Updated : 11 Jul 2020 11:47 IST

భోపాల్‌: ఇప్పటి వరకు మనం ప్రేమ పెళ్లిళ్ల గురించి విని ఉంటాం. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లను చూసి ఉంటాం. ఎవరైనా ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని, పెద్దలు చూసిన అమ్మాయినీ పెళ్లి చేసుకున్నాడు. అదీ ఒకే వేదికపై! ఒకే ముహూర్తానికి!! వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సందీప్‌ అనే వ్యక్తికి పక్క గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇదే విషయాన్ని సందీప్‌కు తెలియజేయగా.. భోపాల్‌లో చదువుకునే సమయంలో తాను మరో అమ్మాయిని ప్రేమించానని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో ఏం చేయాలో తెలియని కుటుంబసభ్యులు  స్థానిక పంచాయితీ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయితీలో పెద్దలు సందీప్‌తో కలిసి జీవించేందుకు ఇద్దరు అమ్మాయిలకు ఇష్టమైతే పెళ్లి జరిపించవచ్చని చెప్పారు. దీనికి మూడు కుటుంబాలూ అంగీకరించాయి. ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి కూడా సందీప్‌ను వివాహం చేసుకునేందుకు అంగీకరించడం కొసమెరుపు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడంతో దీనిపై విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని