మరో అడుగు వెనక్కి..?
డ్రాగన్ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్ వ్యాపారంలో.. భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది. ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్-చైనా సరిహద్దుల్లో
పాంగాంగ్ సరస్సు వద్ద వైదొలగుతున్న చైనా
భారత్కూ ఇబ్బందికర పరిస్థితి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
డ్రాగన్ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఆ దేశం ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది. ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కీలకమైన పాంగాంగ్ సరస్సు వద్ద నుంచి కూడా చైనా బలగాలను వెనక్కి తీసుకొంటోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన పడవల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది. మరోపక్క లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. పాంగాంగ్ సో, డిప్సాంగ్ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునే అంశంపై ఇరు పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సరస్సు వద్ద ఉన్న ఫింగర్ 4 నుంచి దళాలు వైదొలగడం అత్యంత కీలకం.
గల్వాన్ లోయలో ఇరు పక్షాలు వెనక్కి..
జూన్లో ఘర్షణ చోటు చేసుకొన్న పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి ఇప్పటికే ఇరు బలగాలు రెండేసి కిలోమీటర్లు చొప్పున వెనక్కి తగ్గాయి. దీంతోపాటు గోగ్రా, హాట్స్ప్రింగ్స్ ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతున్నాయి. వీటిపై గతవారం భారత ఎన్ఎస్ఏ , చైనా విదేశాంగశాఖ మంత్రి చర్చలు జరిపారు. దీంతో పాంగాంగ్సో సరస్సుపై పూర్తిగా దృష్టిపెట్టారు. ఫింగర్4 నుంచి చైనా బలగాలు ఫింగర్ 8 వద్దకు పంపడం కొంచెం కష్టమే. ఇప్పటికైతే చైనా దళాలు ఫింగర్4 నుంచి 5 వరకు వెనక్కి తగ్గొచ్చు. భారత్ కూడా ఫింగర్ 3 వరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. దీనికోసం భారత్ కూడా కొంత భాగం వెనక్కి రావాల్సి ఉంటుంది. అసలు తొలి ఘర్షణ జరిగింది ఇక్కడే కావడం గమనార్హం.
ఈ సరస్సు టిబెట్ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు ‘ఫింగర్స్’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్ ‘ఫింగర్ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యానికి ఫింగర్ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్ 2 వరకు తమదే అని వాదిస్తోంది. భారత్కు ‘ఫింగర్4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడికి శత్రుబలగాలు వస్తే భారత్ పాంగాంగ్ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్ 4 నుంచి చూస్తే భారత్ మరపడవలను నిలిపే లుకుంగ్ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది.
నిస్సైనిక ప్రాంతాలుగా..
హాట్స్ప్రింగ్స్లో ఇప్పటికే ఇరు బలగాలు కిలోమీటర్ మేరకు వెనక్కి వెళుతున్నాయి. నేటి సాయంత్రానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. చాంగ్చెన్మో నది వద్ద ఉన్న ఈ ప్రాంతంలో ఇరు వర్గాలు పెట్రోలింగ్ కూడా నిర్వహించకూడదు.
ప్రస్తుతం సైనిక దళాలు వెనక్కి తీసుకొనే అంశంలో కొన్ని ప్రదేశాల్లో చైనాకు లాభం చేకూరుతోందని రక్షణరంగ విశ్లేషకులు పేర్కొన్నారు. పెట్రోలింగ్ పాయింట్ 15, పెట్రోలింగ్ 17ఏ వద్ద ఈ ఒప్పందాలతో చైనాకు కొంత లబ్ధిచేకూరే వీలుందని ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రచురిచింది. వాస్తవాధీన రేఖ దాటి చైనా భారత్లోకి ప్రవేశించింది. అవి వివాదాస్పదమైనప్పుడు చైనా ముందుకొచ్చిన మేరకు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. కానీ, ఈ ఒప్పందాల్లో భారత్ కూడా వివాదాస్పద ప్రాంతం నుంచి కొంత వెనక్కి తగ్గడం ఇబ్బందికరంగా మారింది. చైనా వెనక్కి తగ్గినా.. అది వాస్తవాధీన రేఖ వద్దే ఉంటుంది.. భారత భూభాగంలో బఫర్ జోన్ను ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఇవి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాత్కాలికంగా తీసుకొనే చర్యలు.. ఆ తర్వాత జరిగే చర్చల్లో ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంకా చాలా పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఇరు వర్గాలు భారీగా దళాలను మోహరించే ఉన్నాయి. వీటిల్లో పీపీ18, 19, 20, 21, 22,23 ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!