భారీ ఉగ్రదాడికి ప్రణాళిక.. ముష్కరులు హతం
జమ్మూ-కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో.........
అనంత్నాగ్: జమ్మూ-కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరివురు జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా.. ఒకరు పాక్ చెందినవారని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని తెలిపారు.
మరో ఘటనలో జులై 11-12 మధ్యరాత్రి ముగ్గురు ముష్కరుల్ని హతమార్చినట్లు బారాముల్లా డీఐజీ సులేమాన్ సోమవారం వెల్లడించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారన్నారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని.. దాన్ని బట్టి చూస్తే వారు భారీ ఉగ్రదాడికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్