
కొవిడ్తో ఊపిరితిత్తుల్లో నష్టం ఇలా.. !
కళ్లకు కట్టిన వినూత్న చిత్రీకరణ విధానం
బెర్లిన్: తీవ్రస్థాయి కొవిడ్-19 వల్ల ఊపిరితిత్తుల్లో జరిగే నష్టాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దెబ్బతిన్న ఊపిరితిత్తుల కణజాలాన్ని చిత్రీకరించడానికి వీరు హై రిజల్యూషన్ ఇమేజింగ్తో కూడిన వినూత్న విధానాన్ని ఉపయోగించారు. ఈ మహమ్మారికి చికిత్స చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వారు చెప్పారు. గాటింగెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ఒక వినూత్న ఎక్స్రే విధానాన్ని కనుగొన్నారు. ఇది కరోనా వైరస్తో ఇన్ఫెక్షన్కు గురైన ఊపిరితిత్తుల కణజాలాన్ని త్రీడీలో, అత్యధిక రిజల్యూషన్తో చిత్రీకరించడానికి వీలు కల్పించింది. ‘‘అంతర్గతంగా ఏం జరుగుతోందన్నది మనం స్పష్టంగా చూడటం వల్ల రోగి ఉపశమనానికి ఎలాంటి విధానాలు, ఔషధాలు ఉపయోగించాలన్న దానిపై స్పష్టత వస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేనీ జోనిగ్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.