
Updated : 20 Mar 2021 17:17 IST
డీఎన్ఏ పరీక్షతో తేలిన శునక పంచాయితీ!
అసలు యజమానికి అప్పగించిన పోలీసులు
హోషంగాబాద్: డీఎన్ఏ పరీక్షతో కుక్క యజమానిని తేల్చారు మధ్యప్రదేశ్ పోలీసులు. నిరుడు ఆగస్టులో ఓ లాబ్రాడర్ జాతి కుక్క.. నాదంటే నాదంటూ షాదాబ్ ఖాన్, కార్తీక్ శివహరేలు హోషంగాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కుక్కను తాను పచ్మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్లో డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. ‘‘డీఎన్ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది’’ అని షాదాబ్ ఖాన్ తెలిపారు.
ఇవీ చదవండి
Tags :