అమెరికాకు మళ్లీ పెరిగిన అక్రమ వలసలు

అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బైడెన్‌ ప్రభుత్వం మెక్సికోవైపు సరిహద్దులను

Published : 23 Mar 2021 01:25 IST

మెక్సికో సరిహద్దు మూసివేత 

వాషింగ్టన్‌: అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బైడెన్‌ ప్రభుత్వం మెక్సికోవైపు సరిహద్దులను మూసివేసింది. అయితే ఈ కారణంగా మానవీయ, రాజకీయ సవాళ్లు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితులను అదుపు చేయడానికి అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రి అలెజాండ్రో మేయర్‌కోస్‌ స్వయంగా అక్కడికి వెళ్లారు. మొత్తం కుటుంబంతో వచ్చిన వారిని, ఒంటరిగా వచ్చిన పురుషులను అక్కడ నుంచి తిప్పి పంపిస్తున్నామని చెప్పారు. అయితే యువకులు, ఇబ్బందులు పడుతున్న పిల్లలను మాత్రం పంపించడం లేదని తెలిపారు. మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించగా, ఆ విధానాలను సవరిస్తారన్న ప్రచారం జరగడంతో చాలా దేశాల వారు సరిహద్దులకు చేరుకున్నారు. పొరుగున ఉన్న గ్వాటెమాల, హోండురస్, ఎల్‌సాల్వెడార్‌లోని అంతర్గత గొడవల కారణంగా అక్కడ నుంచి కూడా భారీగానే వలస వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని