Vaccine: రెండో డోసు ఆలస్యమైనా గాబరా పడొద్దు
కరోనా టీకా రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైనా గాబరా పడొద్దని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా
వ్యాక్సిన్ పనిచేస్తుంది
ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్
ఈనాడు, దిల్లీ: కరోనా టీకా రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైనా గాబరా పడొద్దని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. ఆలస్యమైనా అది పనిచేస్తుందని, ఎవరూ మానొద్దని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘కొవిడ్ వచ్చి తగ్గినవారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక టీకా వేయించుకోవడం తప్పనిసరి. రెండో డోసు కొన్ని వారాలు ఆలస్యమైతే వ్యాక్సిన్ పనిచేయదని అనుకోవద్దు. ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వైద్య వసతులపై ఒత్తిడి పెరిగింది. ఒకరోగి ఆక్సిజన్ కోసం ఆసుపత్రిలో చేరితే పదిరోజుల వరకూ అక్కడే ఉండాలి. కానీ బయట పడకల కోసం నిరీక్షిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇప్పుడు మహమ్మారి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వ్యాపిస్తోంది.
దశను బట్టి మందులు వాడాలి...
కొవిడ్లో రెండు దశలున్నాయి. ఏ దశలో వాడాల్సిన మందులు ఆ దశలోనే వాడాలి. అదే సమయంలో మందుల దుర్వినియోగాన్ని పరిహరించాలి. మొదటి దశలో వైరస్ శరీరంలో విస్తరించి దగ్గు, జ్వరం, జలుబు వస్తాయి. లక్షణాలకు అనుగుణం ఇచ్చే చికిత్సతో చాలామంది కోలుకుంటారు. కొందరిలో వైరస్ ఊపిరితిత్తుల్లో ఎక్కువ వ్యాపిస్తుంది. అలాంటి వారిని రెండోదశ రోగులుగా గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించాలి. వారికి రెమ్డెసివిర్, ప్లాస్మా ఇస్తుంటారు. రెండో దశలో వైరస్ లోడు ఎక్కువగా లేకపోయినా, రోగనిరోధకశక్తి అస్తవ్యస్తంగా మారొచ్చు. అప్పుడు స్టెరాయిడ్స్, ఇతర మందుల అవసరం ఉంటుంది. మొదటి దశలో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి... ఏ దశలో ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలు పంపుతున్నాం. ఆసుపత్రుల్లో వసతులను పెంచుకుంటూనే కేసులను తగ్గించుకోవాల్సి ఉంది. ఇందుకోసం ‘బ్రేక్ ద చైన్’ ఉద్యమాన్ని మొదలుపెట్టాలి’’ అని ఆయన సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో మూడోదశ టీకా పంపిణీ: లవ్ అగర్వాల్
ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్ డోసులు కొనుగోలుచేసిన కొన్ని రాష్ట్రాల్లో... మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారికి టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. తొలుత కొన్నిచోట్ల ప్రారంభమైనా, తర్వాత విస్తరిస్తుందన్నారు. ‘‘కేంద్రం ఇప్పటివరకు 15 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసింది. 45 ఏళ్లు దాటినవారికి ఇకపైనా ఉచితంగానే అందిస్తుంది’’ అని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం