China: మంచు కొండల్లో డ్రాగన్ వణుకు
హిమాలయాల్లో విధులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడి దేశ సరిహద్దుల్లో గస్తీ తిరగడం పెద్ద సవాలు.
భారత సరిహద్దు నుంచి పలువురు వెనక్కి!
దిల్లీ: హిమాలయాల్లో విధులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడి దేశ సరిహద్దుల్లో గస్తీ తిరగడం పెద్ద సవాలు. ఈ విషయంలో భారత సైన్యానికి చైనా సరితూగడం లేదు. ప్రతికూల వాతావరణం, ఎముకలు కొరికే చలికి ఆ దేశ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. చలికాలంలో పలు రకాలుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది దేశ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది సైనికులను ఆ దేశం మోహరించింది. వారిలో 90 శాతం మంది తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దాంతో దేశంలోని ఇతర స్థావరాల్లో ఉంటున్న రిజర్వు దళాలను ఇక్కడికి పంపించింది. రొటేషన్ పద్ధతిలో సైనికులను మోహరించాల్సి వస్తోంది. దాంతో 90 శాతం మంది సైనికులను ఎప్పటికప్పుడు మార్చి వేస్తోందని భారత ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. గస్తీ కాస్తున్న జవాన్లను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.
భారత్ కూడా సైనికులను మార్చుతుంటుంది. అయితే ప్రతి జవాను లద్దాఖ్లో కనీసం రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రొటేషన్లో భాగంగా ప్రతి ఏటా 40-50 శాతం మంది సైనికులను ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించి, అక్కడి వారిని తీసుకొస్తుంటుంది. మంచుకొండల్లో యుద్ధం చేయడం, గస్తీ కాయడంపై బలగాలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ విషయంలో భారత్ ఆరితేరింది. ప్రస్తుతం చైనా కూడా ఇదే పనిచేస్తోంది. భారత్ భూభాగానికి గంటల్లో చేరుకునేలా కసరత్తులు ప్రారంభించింది. ప్రతిగా భారత్ కూడా కీలక స్థానాల్లో బలగాలను మోహరించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న భారత్ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే లద్దాఖ్కు స్వయంగా వెళ్లి బలగాలకు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సైన్యానికి తగిన సమాచారం అందిస్తున్నారు. చైనా అధ్యయన బృందం త రచూ సమావేశమయి సైన్యానికి మార్గదర్శనం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?