Biden: టీకాల లక్ష్య సాధన ఎలా?
బద్ధకస్థులు, సందేహాల జీవులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పెద్ద తలనొప్పే ఎదురవుతోంది.
బైడెన్ ప్రభుత్వం కసరత్తు
అమెరికా యువతలో పెరుగుతున్న నిర్లిప్తత
వాషింగ్టన్: బద్ధకస్థులు, సందేహాల జీవులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పెద్ద తలనొప్పే ఎదురవుతోంది. కరోనా టీకాలు వేసుకోవడానికి వారెవరూ ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జులై నాలుగు నాటికి 70 శాతం మందికి టీకాలు వేయడం పూర్తికావాలని మే 4న బైడెన్ లక్ష్యంగా పెట్టారు. ఆ రోజున ఆయన అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఇది జీవన్మరణ సమస్య. మొత్తం 100% మందికి టీకాలు వేయాలని అనుకున్నాం. వాస్తవాలను గమనించి దాన్ని 70 శాతానికే పరిమితం చేశాం’’ అని చెప్పారు. అయితే అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. బుధవారం నాటికి 65.6% మందికి కనీసం ఒక డోసు టీకా లభించింది. జులై 4 నాటికి 67 శాతం మంది వ్యాక్సిన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకాలు వేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాన్ని అధిగమించి ఏకంగా 20 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తోంది.
నిర్లిప్తతే అసలు కారణం
‘టీకా తీసుకోవడం ఇప్పుడు అంత అత్యవసరమా?’ అన్న ధోరణే లక్ష్యం చేరుకోవడానికి ప్రధాన ఆటంకంగా మారిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. చాలామందిలో ఈ నిర్లిప్తత కనిపిస్తోందని అంటున్నారు. టీకాల కోసం ఎన్నో దేశాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో, అమెరికా వాసుల్లో ఈ స్థాయి నిర్లిప్తత ఉంటుందని ఊహించలేదని చెబుతున్నారు. తొలి దశలో టీకాల కార్యక్రమానికి భారీ స్పందన కనిపించింది. దానివల్ల కేసులు, మరణాలు అదుపులోకి వచ్చాయి. చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేశాయి. వ్యాపార సంస్థలు, పాఠశాలలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ జన సమూహాలు కనిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు టీకాల అవసరం పెద్దగా లేదన్న భావన పెరిగిందని, దీనిపై ప్రజలకు నచ్చజెప్పడం కష్టంగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంది. ‘‘ట్రంప్ అభిమానులైన యువ ఓటర్లు టీకాలపై ఆసక్తి చూపడం లేదు. వారు దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. తమకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి కూడా టీకాలు వేసుకోవడం లేదు’’ అని రిపబ్లికన్ పార్టీ రాజకీయ విశ్లేషకుడు ఫ్రాంక్ లాంజ్ చెప్పారు.
రంగంలోకి అధ్యక్షుడు
పరిస్థితిని గమనించిన బైడెన్ స్వయంగా రంగంలో దిగారు. దేశవ్యాప్తంగా ‘కార్యాచరణ మాసం’ నిర్వహిస్తామని ప్రకటించారు. ‘చొక్కా చేతులు పైకి లాగండి’ అంటూ పిలుపునిచ్చారు. స్థానికంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్రాల మధ్య భారీగా తేడాలు ఉండడంతో దాన్ని సరిచేయాలని నిర్ణయించారు. వెర్మోంట్ రాష్ట్రంలో 80 శాతం మంది టీకాలు వేసుకున్నారు. మిస్సోరిలో ఈ సంఖ్య 40 శాతానికి మించలేదు. 13% దాటని రాష్ట్రం కూడా ఉంది. కరోనా వైరస్లోనూ మార్పులు వస్తున్నందున వాటివల్ల కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్