న్యాయవాదులపై దాడిచేస్తే 5 ఏళ్ల శిక్ష
న్యాయవాదులపై దాడిచేస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష,
రెండోసారి తప్పుచేస్తే పదేళ్లవరకు ఖైదు
బార్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు
ఈనాడు, దిల్లీ: న్యాయవాదులపై దాడిచేస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించాలని బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ‘న్యాయవాదుల పరిరక్షణ బిల్లు-2021’ ముసాయిదా ప్రతిపాదించింది. తెలంగాణలో న్యాయవాది గట్టు వామనరావు, సతీమణి నాగమణిలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టపగలు నడిరోడ్డుపై హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో న్యాయవాదుల రక్షణ అంశం తెరమీదికి వచ్చింది. ఇందుకోసం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల కమిటీ అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ 2021 బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ఛైర్మన్ ఎ.రామిరెడ్డి కూడా పాలుపంచుకున్నారు.
ఇవన్నీ దాడి కిందికే వస్తాయి
న్యాయవాదులు వృత్తి బాధ్యతలు నిర్వర్తించకుండా అసాంఘిక శక్తులు వారిపై దాడిచేయడం, నేరపూరితంగా బెదిరించి ఒత్తిడి చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయినందున అలాంటివారిపై ఈ బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదించింది. వేధింపులు, బెదిరింపులు, దాడి, నేరపూరిత ఒత్తిడి, ప్రాణానికి ముప్పు కల్గించేలా, విధులకు అడ్డంకులు కల్పించేలా బెదిరింపులు చేయడం, హానికరమైన గాయాలు చేయడం, కోర్టు ప్రాంగణంలోనే ముప్పు తలపెట్టడం, వకాల్తా ఉపసంహరించుకోమని ఒత్తిడి చేయడం, కోర్టు ముందు హాజరుకాకుండా అడ్డుకోవడం, ఆస్తులు, డాక్యుమెంట్లు, మెటీరియల్ను ధ్వంసం చేయడం, న్యాయప్రక్రియ సమయంలో అసభ్యభాష ప్రయోగించడంలాంటివన్నీ న్యాయవాదులపై దాడి కిందికే వస్తాయని ఈ బిల్లులో ప్రతిపాదించారు. తొలిసారి ఇలాంటి నేరానికి పాల్పడినవారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా, రెండోసారి అదే తప్పుచేసిన వారికి ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ కేసులను ఎస్పీ ర్యాంకు స్థాయి అధికారి దర్యాప్తు చేయాలని, ఎఫ్ఐఆర్ నమోదైన నాటినుంచి 30 రోజుల్లోపు విచారణ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ముప్పు ఉన్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించేలా నిబంధన రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు