Drone: డ్రోనాసురులను వేటాడేదెలా!
‘‘డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికత మన దగ్గర లేదు’’ జమ్ము వాయుసేన స్థావరంపై దాడి
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే
దిల్లీ: ‘‘డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికత మన దగ్గర లేదు’’ జమ్ము వాయుసేన స్థావరంపై దాడి అనంతరం ఒక బీఎస్ఎఫ్ అధికారి చెప్పిన మాట ఇది. ప్రస్తుతం సైనికులు అప్రమత్తంగా ఉండి, తూటాలు ప్రయోగిస్తూ డ్రోన్లను అడ్డుకుంటున్నారు. దీంతో పాక్ సరిహద్దుల నుంచి వస్తున్న డ్రోన్లు సులభంగా తప్పించుకుపోతున్నాయి. ఆదివారం జమ్ము.. వైమానిక స్థావరంపై జరిగిన దాడిలోనూ అదే జరిగింది. దాడికి వచ్చిన రెండు డ్రోన్లు బాంబులు వేసి సులభంగా తప్పించుకున్నాయి. మరి దీనికి మార్గం లేదా అంటే.. ఉందంటున్నారు నిపుణులు.
‘‘కేవలం డ్రోన్లతోనే 100 బిలియన్ డాలర్ల సైనిక పరికరాలను ధ్వంసం చేశాం’’ అని ఆర్మేనియాతో యుద్ధం తర్వాత అజర్బైజాన్ అధ్యక్షుడు తెలిపారు. దీన్ని బట్టే డ్రోన్ల సత్తా ఏంటో అర్థమవుతుంది. ఆర్మేనియా సంప్రదాయ యుద్ధం చేస్తే.. అజర్బైజాన్ వ్యూహాత్మక సైనిక ప్రాంతాలపై నిప్పులు కక్కే డ్రోన్లతో విరుచుకుపడి కీలక విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ సహా చాలా దేశాలు డ్రోన్లను అడ్డుకునే సాంకేతికతపై దృష్టి పెట్టాయి.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ రాకెట్లను నిరోధించడానికి ‘ఐరన్ డోమ్’ వ్యవస్థను రూపొందించిన ఇజ్రాయెలీ రక్షణ సంస్థ రఫేల్ ‘డ్రోన్ డోమ్’ అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్లను గుర్తించి.. వాటి కెమెరాలను పనిచేయకుండా చేస్తుంది. శక్తిమంతమైన లేజర్ పుంజాలతో కచ్చితంగా డ్రోన్ను నేలకూల్చగలదు. రాత్రివేళ కూడా ఇది పనిచేయగలదు. అమెరికాకు చెందిన ఫోర్టెమ్ టెక్నాలజీ కూడా ఇదే తరహాలో ఇంటర్సెప్టర్ డ్రోన్ను తయారు చేసింది. దీని పేరు.. డ్రోన్ హంటర్. ఇది ఒక వల లాంటి పరికరంతో డ్రోన్ను బంధించి నేలకు దింపుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రైవేట్ సంస్థ డ్రోన్షీల్డ్ .. డ్రోన్ల రేడియో ఫ్రీక్వెన్సీని అడ్డుకొని.. వీడియోకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా సదరు డ్రోన్ వెంటనే నేలపైకి దిగడమో ఆపరేటర్ వద్దకు వెనుదిరగడమో చేస్తుంది.
భారత్లో ఇంద్రజాల్!
యాంటీ డ్రోన్ టెక్నాలజీని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసింది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో దీన్ని మోహరించారు. అదే ఏడాది దిల్లీలో ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకల్లోనూ ఉపయోగించారు. ఇది 3 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించి జామ్ చేయగలదు. 1- 2.5 కిలోమీటర్ల దూరంలోని లోహ విహంగాలపై లేజర్ ఆయుధాన్ని ప్రయోగించగలదు. అయితే దీని పరిధి తక్కువగా ఉంది. ఇటీవల భారత్లోని గ్రీన్ రోబోటిక్స్ సంస్థ ‘ఇంద్రజాల్’ అనే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1000 నుంచి 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేయగల సత్తా ఈ టెక్నాలజీ సొంతమని ఆ సంస్థ చెబుతోంది. పాకిస్థాన్ సరిహద్దు పొడుగునా యాంటీ డ్రోన్ వ్యవస్థను నెలకొల్పాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అయితే ఇంద్రజాల్తో ఆ ఖర్చును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ ఆధారంగా రూపొందించారు.
పాక్ నుంచే 300 డ్రోన్లు
అధికారిక లెక్కల ప్రకారం..2019లో పాక్ నుంచి దాదాపు 300 డ్రోన్లు భారత్ భూభాగంలోకి వచ్చాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని రక్షణరంగ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఈ డ్రోన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నిన్న మొన్నటివరకు వీటిని కేవలం ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు దాడులకు ఉపయోగిస్తున్న తరుణంలో భారత్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని వీలైనంత త్వరగా సమకూర్చుకోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత