Covid: మావోయిస్టు పార్టీపై కరోనా పంజా!
అడవుల్లో అజ్ఞాతంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో సతమతమవుతున్నారా?
దెబ్బతీస్తున్న ఇతర అనారోగ్యాలు
నెల వ్యవధిలో ఆరుగురు నేతల మృతి
ఈనాడు, హైదరాబాద్: అడవుల్లో అజ్ఞాతంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో సతమతమవుతున్నారా? క్యాడర్ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి కార్యకలాపాలు తగ్గించుకున్నా.. ఈ కొత్త ముప్పు, ఇతర అనారోగ్యాలు మావోయిస్టులను దెబ్బతీస్తున్నాయా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా ఈ క్యాడర్లో తెలంగాణ వారి ప్రాతినిధ్యం తగ్గిపోతుండగా.. ఈ నెలలో ఈ ప్రాంత నేతల వరుస మరణాలు ఆ పార్టీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంచనావేస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే కరోనాతో నలుగురు చనిపోగా, ఒకరు గుండెపోటుతో, ఇంకొకరు పోలీసు కాల్పుల్లో మరణించారు. మరో 20 మంది కొవిడ్ బారినపడినట్లు సమాచారం. కొన్ని సంవత్సరాలుగా అడవులకే పరిమితం కావడం, సరైన ఆహారం లేకపోవడం, వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మావోయిస్టు పార్టీలో ఈ ఏడాది మొదట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు వివిధ స్థాయిల్లో 145 మంది వరకూ ఉన్నారు. వీరిలో సగం మందికిపైగా వయోభారంతో క్షేత్రస్థాయి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాల కమిటీల బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీలో దాదాపు వంద మంది ఉండగా వారిలో 85 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారే. 15 మంది మాత్రమే తెలంగాణ వారు. రాష్ట్రంలో క్యాడర్ని పెంచేందుకు, కొత్త నియామకాలకు మైలారపు భాస్కర్ అలియాస్ ఆదెల్లు ఆధ్వర్యంలో గత ఏడాది తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆసిఫాబాద్, భూపాలపల్లిలో భాస్కర్ స్వయంగా అనేకమార్లు పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది మావోయిస్టులు చనిపోయారు. వారంతా ఛత్తీస్గఢ్ వారే. ఈ ఉదంతం నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. మావోయిస్టులపై పోరాటంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఏరికోరి ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో కొత్త క్యాడర్ సంగతి పక్కనపెట్టి ఉన్నవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టులు క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చారు. ఈలోపు కరోనా రూపంలో ముప్పు ముంచుకొచ్చింది.
* కరోనా సోకి చికిత్స కోసం వస్తుండగా ఈ నెల మొదటి వారంలో డివిజన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ వరంగల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో మరణించాడు.
* ఆ తర్వాత వరుసగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్, ఆయన భార్య శారదక్క, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనాతో మరణించారు.
* కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్రావు గుండెపోటుతో మరణించారు.
* ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో తెలంగాణకు చెందిన డివిజన్ కమిటీ సభ్యుడు సందె గంగయ్య ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే