Lottery: అబుదాబిలో కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్‌

అబుదాబిలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది.

Updated : 05 Jul 2021 10:17 IST

దుబాయ్‌: అబుదాబిలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో 3 కోట్ల దిర్హమ్‌లు (సుమారు రూ.40 కోట్లు) గెలుచుకున్నాడు. 37 ఏళ్ల రెంజిత్‌ సోమరాజన్‌ 2008 నుంచి అబుదాబిలో డ్రైవర్‌గా ఉన్నాడు. మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న మరో 9 మంది సహచరులతో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై టికెట్‌ కొన్నాడు. దీనికే జాక్‌పాట్‌ తగిలింది. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని