Covid: కడుపు కొట్టిన కరోనా!
కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నానా రకాలుగా కుంగదీస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆహారలేమి
కొవిడ్ మహమ్మారే ప్రధాన కారణం.. ఐరాస నివేదిక
రోమ్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నానా రకాలుగా కుంగదీస్తోంది. తిండికీ నోచుకోని అభాగ్యుల సంఖ్యను పెంచేసింది. గత ఏడాది ఆకలి సమస్య మరింత తీవ్రమైందని ఐరాస పేర్కొంది. కరోనా విజృంభణే ప్రధాన కారణమని తెలిపింది. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని వివరించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మందికి పోషకాహార లోపం ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు సంవత్సరం అది 8.4 శాతంగా ఉండేదని తెలిపింది. ఐరాసకు చెందిన ఐదు సంస్థలు సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ ఆందోళనకర వివరాలు ఉన్నాయి. అందులోని ప్రధానాంశాలివీ..
☞ ప్రధానంగా ఆఫ్రికాలో క్షుద్బాధ దారుణంగా పెరిగింది. అక్కడ 21 శాతం మందికి పౌష్టికాహార లోపం ఉంది.
☞ ఆహారం లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఐదేళ్ల లోపు వయసున్న దాదాపు 14.9 కోట్ల మందిలో శారీరక ఎదుగుదల బాగా తక్కువగా ఉంది. 4.5 కోట్ల మంది పిల్లలు చాలా తక్కువ బరువును కలిగి ఉన్నారు.
☞ మొత్తంమీద 3 వందల కోట్ల మంది పెద్దలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం.. అందని ద్రాక్షగానే ఉంది. అధిక ధరలే ఇందుకు కారణం.
☞ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహమ్మారి వల్ల తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యం తలెత్తింది. ఫలితంగా ఆహార లభ్యత తగ్గిపోయింది. నిజానికి కరోనా విజృంభణకు ముందు నుంచే ఆకలి సమస్య పెరుగుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు మందగమనంలో సాగుతున్నాయి.
☞ మరోవైపు 3.9 కోట్ల మంది చిన్నారులకు ఊబకాయం ఉంది.
☞ 2030 నాటికి ప్రపంచంలో క్షుద్బాధను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస లక్ష్యానికి కరోనా గండికొట్టేలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే 2030 నాటికి ఇంకా 66 కోట్ల మంది ఆకలి కోరల్లో విలవిలలాడుతుంటారు. అందులో దాదాపు 3 కోట్ల మంది.. కరోనా మహమ్మారి వల్ల ఉత్పన్నమయ్యే దీర్ఘకాల ప్రభావాలను ఎదుర్కొనేవారే.
ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడీ), యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)లు ఈ నివేదికను రూపొందించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు