Corona: ప్రధాన విలన్ డెల్టానే
టీకా పొందాక కూడా కొందరు కొవిడ్-19 బారినపడటానికి ప్రధాన కారణం డెల్టా రకం కరోనా వైరస్సేనని
టీకా పొందాకా.. కరోనా సోకడానికి ఇదే కారణం
తీవ్ర ఇన్ఫెక్షన్ను తగ్గించిన వ్యాక్సిన్లు
ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: టీకా పొందాక కూడా కొందరు కొవిడ్-19 బారినపడటానికి ప్రధాన కారణం డెల్టా రకం కరోనా వైరస్సేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇలాంటివారిలో 9.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవించిందని తేలింది. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని, మరణాలను టీకాలు తప్పిస్తున్నాయని అధ్యయనం స్పష్టంచేసింది. వ్యాక్సినేషన్ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా కొవిడ్ తదుపరి ఉద్ధృతుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ అనంతర ఇన్ఫెక్షన్లపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించిన తొలి అధ్యయనం ఇదే. ఇందులో టీకాలు పొందినప్పటికీ కొవిడ్ పాజిటివ్గా తేలిన 677 మందికి చెందిన స్వాబ్ నమూనాలను విశ్లేషించారు. 17 రాష్ట్రాల నుంచి వీటిని తీసుకున్నారు.
* మొత్తం 677 మందిలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్ బారినపడ్డారు. ఈ రకం వైరస్.. మార్చి-జూన్ నెలలో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించింది. ఆల్ఫా, కప్పా వేరియంట్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
* 67 మంది (9.8 శాతం) ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. ముగ్గురు (0.4 శాతం మంది) చనిపోయారు.
* భారత దక్షిణ, పశ్చిమ, తూర్పు, వాయవ్య ప్రాంతాల్లో ప్రధానంగా డెల్టా, ఆ తర్వాత కప్పా వేరియంట్లు ఉన్నాయి.
* 677 మందిలో 85 మందికి మొదటి డోసు టీకా తీసుకున్నాక కొవిడ్ సోకింది. 592 మందికి రెండు డోసులు పొందాక వచ్చింది.
* ఈ కేసుల్లో 71 శాతం మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించగా.. 29 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు.
రెండు డోసులతో పోలీసులకు రక్షణ
కొవిడ్ ముప్పు ఎక్కువగా పొంచి ఉండే పోలీసు సిబ్బందికి టీకాలు ఇవ్వడం సత్ఫలితాలను ఇచ్చిందని ఐసీఎంఆర్ నిర్వహించిన మరో అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్తో తలెత్తిన రెండో ఉద్ధృతిలో 95 మరణాలను తగ్గించడానికి ఇది వీలు కల్పించిందని వెల్లడైంది. తమిళనాడులో 1,17,524 మంది పోలీసు సిబ్బందిపై దీన్ని నిర్వహించారు. వీరిలో 17,059 మంది టీకా పొందలేదు. 32,792 మంది ఒక డోసును, 67,673 మంది రెండు డోసులు పొందారు.
* టీకా పొందనివారిలో కొవిడ్తో చనిపోయినవారు 20 మంది ఉన్నారు. మొదటి డోసు పొందాక ప్రాణాలు కోల్పోయినవారు ఏడుగురు, రెండో డోసు పొందాక చనిపోయినవారు నలుగురు ఉన్నారు.
* మొదటి డోసు పొందినవారిలో టీకా సమర్థత 82%, రెండో డోసు పొందినవారిలో 95% కనిపించింది.
* టీకా పొందనివారిలో కొవిడ్-19 మరణాలు ప్రతి వెయ్యి మందిలో 1.17గా ఉండగా.. పాక్షికంగా టీకా పొందినవారిలో అది 0.21గా, పూర్తిస్థాయిలో టీకా పొందినవారిలో అది 0.06గా ఉంది.
దీన్ని బట్టి మన టీకాలు సురక్షితమని, తీవ్ర ఇన్ఫెక్షన్ను నివారించడంలో సమర్థత చాటుతున్నట్లు స్పష్టమైందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు.
కొత్త వేరియంట్ల గుర్తింపు
డెల్టా ఉపరకాలైన ఏవై.1, ఏవై.2లనూ ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకం వైరస్ల స్పైక్ ప్రొటీన్లో కే417ఎన్, ఈ484కె, ఎల్452ఆర్, ఈ484క్యూ అనే ఉత్పరివర్తనలను గుర్తించారు. ప్రస్తుత టీకాల వల్ల ఉత్పన్నమైన మానవ రోగ నిరోధక స్పందన నుంచి తప్పించుకోవడానికి ఇవి వైరస్కు సాయపడొచ్చని పరిశోధకులు చెప్పారు. తద్వారా ఆ రకాల సంక్రమణం వేగంగా ఉండొచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్ మీడియా వేదికగా తోసిపుచ్చారు. -
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..