Corona: కొవిడ్ మహమ్మారి మళ్లీ విశ్వవిజృంభణ
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్ ‘డెల్టా’
జపాన్లో ‘వైరస్ ఎమర్జెన్సీ’
అమెరికాలో 92 వేలకు పైగా కేసులు
చైనాలో 15 నగరాల్లో కొవిడ్ వ్యాప్తి
టోక్యో/బీజింగ్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్ ‘డెల్టా’ రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జపాన్ ‘వైరస్ ఎమర్జెన్సీ’ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాజధాని టోక్యోలో ఇప్పటికే ‘అత్యవసర పరిస్థితి’ ఉండగా మరో 4 ప్రాంతాల్లోనూ అమలుకు శుక్రవారం నిర్ణయించింది. టోక్యో సమీపంలోని సైతమా, కనగావా, చిబాలతో పాటు ఒసాకా నగరం పశ్చిమ ప్రాంతాల్లోనూ ‘ఎమర్జెన్సీ’ విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా ప్రకటించారు. వీటితో పాటు టోక్యో, ఒకినావా ద్వీపాల్లోనూ ఆగస్టు 31 వరకు ఎమర్జెన్సీ ఉంటుందని వెల్లడించారు. కాగా హొక్కైడ, క్యోటో, హ్యోగో, ఫుకుఓకా ప్రాంతాల్లో తక్కువ స్థాయి ఎమర్జెన్సీ నిబంధనలు అమలు చేయనున్నారు. జపాన్లో తొలిసారిగా గురువారం 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఎమర్జెన్సీలో భాగంగా పనివేళలను కుదించడం.. బార్లు, హోటళ్లలో మద్యపాన నిషేధం వంటివి చేపడుతున్నారు. దేశంలో స్వల్ప లక్షణాలున్న కొవిడ్ బాధితులకు యాంటీబాడీ కాక్టైల్ వినియోగానికి ప్రభుత్వం అనుమతించినట్లు ప్రధాని తెలిపారు. అయితే వేల మంది ఆసుపత్రి పడకలు, చికిత్సల కోసం ఎదురు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని.. ఈ క్రీడలకు కొవిడ్ వ్యాప్తికి సంబంధం లేదని చెప్పారు. కాగా గురువారం నాటికి 27% మంది జపనీయులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందారు.
టోక్యోలో రెండు వారాలుగా.. టోక్యోలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పటికీ రెండు వారాలుగా కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు 24 నుంచి ఈ నగరంలో పారాలింపిక్స్ కూడా ప్రారంభం కానున్నాయి. గత 3 రోజులుగా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా టోక్యోతో పాటు పశ్చిమ మెట్రోపాలిటన్ పారంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుత్నుట్లు సుగా తెలిపారు. కరోనా వైరస్ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. ఇదేతీరులో పరిస్థితి కొనసాగితే జపాన్లోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ప్రధాని చెప్పడం తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యోలో 6 వేల ఆసుపత్రి పడకల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 2,995 మంది ఆసుపత్రి పాలయ్యారు. మరో 10 వేల మంది ఇళ్లు, హోటళ్లలో ఐసొలేషన్లో ఉంటున్నారు.
అగ్రరాజ్యంలో ఉద్ధృతి
అమెరికాలో గత కొద్ది రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజులో 92 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు రోజు 84 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.
చైనాలోనూ డెల్టా
చైనాలో రాజధాని బీజింగ్తో పాటు మరో 14 నగరాల్లో ఒక్కసారిగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ డెల్టా రకం వేగంగా విజృంభిస్తోంది. 2019 డిసెంబరులో వుహాన్లో తొలిసారి కరోనా విజృంభించిన తర్వాత ఇదే అత్యంత తీవ్ర పరిస్థితిగా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ తెలిపింది. చైనా జియాంగ్సు ప్రావిన్స్ పరిధిలోని నన్జింగ్ విమానాశ్రయంలో తొలుత కొవిడ్ వ్యాప్తి బయటపడింది. ఇక్కడ అధిక సంఖ్యలో సిబ్బందికి ‘పాజిటివ్’గా తేలడంతో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం బీజింగ్ మున్సిపాలిటీతో పాటు 5 ఇతర ప్రావిన్సులకు మహమ్మారి వ్యాప్తి చెందినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. బీజింగ్లో ఆఖరి కేసు నమోదై 175 రోజులు కావస్తుండగా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నన్జింగ్ నగరంలో దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. కాగా చైనా జనాభాలో ఇంతవరకు 40 శాతం మందికి టీకాలు వేసినట్లు అధికారిక మీడియా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్