Earphones: ఇయర్ఫోన్స్ పేలి యువకుడి మృతి
బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పేలిన కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పేలిన కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపుర్ జిల్లా చౌమూలో శుక్రవారం జరిగింది. మృతుడు ఉదయ్పుర గ్రామానికి చెందిన రాకేశ్ నాగర్గా పోలీసులు గుర్తించారు. ఇయర్ఫోన్స్ను కనెక్ట్ చేసుకుని రాకేశ్ మాట్లాడుతున్న సమయంలో అవి పేలాయి. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇయర్ఫోన్స్ పేలిన సమయంలో రాకేశ్ నాగర్కి గుండెపోటు వచ్చి ఉంటుందని.. ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు భావిస్తున్నారు. దేశంలో ఈ తరహా ఘటన ఇదే తొలిసారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?