Indian Navy: సాగర జలాల్లో త్రినేత్రం.. మూడో విమానవాహక నౌక కోసం నేవీ ప్రతిపాదన
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం
దాడి సామర్థ్య మెరుగుకు అవసరమని వాదన
దిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం భారత నౌకాదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శత్రువు కంటపడకుండా సముద్ర జలాల్లో సంచరించే స్టెల్త్ జలాంతర్గాములపై ఆసక్తి ఉన్నప్పటికీ కనీసం మూడు విమానవాహక నౌకలను కలిగి ఉండాలన్న ఆకాంక్ష ఈ దళంలో ఎక్కువగా ఉంది. దీన్ని సాకారం చేసుకోవాలని గట్టిగా భావిస్తోంది.
ప్రస్తుతం భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే విమానవాహక నౌక ఒకటే సేవలు అందిస్తోంది. దీన్ని రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తాజాగా 37,500 టన్నుల బరువైన స్వదేశీ విమాన వాహక నౌక (ఐఏసీ-1) సిద్ధమైంది. కొచ్చిన్ షిప్యార్డ్ నుంచి నాలుగు రోజుల సాగర పరీక్షల కోసం అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నౌకాదళంలో చేరాక దీనికి ఐఎన్ఎస్ విక్రాంత్ అని నామకరణం చేస్తారు. 2023లో అది సాకారం కావొచ్చు.
ఏం పరీక్షిస్తారు?
సముద్ర జలాల్లో (ఐఏసీ-1)కు ప్రధానంగా ‘డ్రాట్’ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఈ భారీ నౌక సురక్షితంగా ప్రయాణించడానికి అవసరమైన లోతును నిర్ధరిస్తారు. ఇది దాదాపు 30 మీటర్లు ఉండొచ్చని అంచనా. లంగరు వేసినప్పుడు నౌక ఎంత స్థిరంగా ఉంటుందన్నదీ పరిశీలించనున్నారు. అలాగే స్టీరింగ్, ఎలక్ట్రానిక్ సాధనాల సత్తా, ఇంజిన్ ఏకబిగిన ఎంతసేపు పనిచేయగలదు, నౌక వేగం వంటివి పరీక్షించనున్నారు. ఈ యుద్ధనౌక నేవీలో చేరాకే.. దీని డెక్ నుంచి ఆయుధాలతో కూడిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్ పరీక్షలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
మూడు కావాలి
రెండో విమానవాహక నౌక సిద్ధమైన నేపథ్యంలో.. మూడోదాని కోసం నేవీ కసరత్తు కొనసాగిస్తోంది. ఇలాంటి నౌకలు మూడు అవసరమని 1985-2000 కాలానికి సంబంధించిన తన ప్రణాళికలోనే ప్రతిపాదించింది. వీటిలో ఒకటి మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం లంగరు వేసినా.. మిగతా రెండు తూర్పు, పశ్చిమ తీరాల్లో ఒక్కొక్కటి చొప్పున విధులు నిర్వర్తించాలని అందులో పేర్కొంది. దీనివల్ల నేవీ దాడి, ఆత్మరక్షణ సామర్థ్యం రాటుదేలుతుందని తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఒక విమానవాహక నౌక విజయవంతంగా సిద్ధం కావడంతో ఆ అనుభవాన్ని ఉపయోగించి రెండో నౌకను సులువుగానే సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు.
చైనా వద్ద షాండాంగ్ (70వేల టన్నులు), లియావోనింగ్ (67,500 టన్నులు) అనే రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి. అమెరికా వద్ద ఇలాంటివి 11 యుద్ధనౌకలు ఉన్నాయి. ఒక్కోదాని బరువు లక్ష టన్నులపైనే. ఒకప్పుడు సముద్రంలో ఒక దేశ సత్తాకు విమానవాహక నౌకలే తార్కాణంగా ఉండేవి. బాలిస్టిక్ క్షిపణులు, హైపర్ సోనిక్ అస్త్రాల రాకతో వీటి ప్రభ ఒకింత తగ్గింది. అయినా శక్తిమంతమైన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతో సాగర జలాల్లో కదిలే నగరంలా కనిపించే విమానవాహక నౌక.. శత్రువు వెన్నులో దడ పుట్టించడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ