ఇంకా ముప్పు ముంగిటే!
కరోనా సెకండ్వేవ్ సృష్టించిన బీభత్సాన్ని జనం అప్పుడే మర్చిపోయారనిపిస్తోంది..!
కరోనా గండం పొంచే ఉంది.. జాగ్రత్తలు విస్మరిస్తున్న జనం
ఈనాడు, అమరావతి: కరోనా సెకండ్వేవ్ సృష్టించిన బీభత్సాన్ని జనం అప్పుడే మర్చిపోయారనిపిస్తోంది..! కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో...ఎక్కడ తిరిగినా, ఎలా తిరిగినా ఫరవాలేదనుకుంటున్నారు కొందరు. భౌతికదూరం పాటించడం, మాస్కు పెట్టుకోవడం ద్వారా కొవిడ్ వ్యాప్తిని నియంత్రించవచ్చన్న ప్రాథమిక సూత్రాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మొదలు రోడ్డు పక్కన తినుబండారాలమ్మే బళ్ల దగ్గరా, టీ షాపుల దగ్గరా గుంపులుగా చేరుతున్నారు. మద్యం దుకాణాల దగ్గర చెప్పాల్సిన పనేలేదు. ఆదివారం వస్తే చేపల మార్కెట్లు, మాంసం దుకాణాల దగ్గర బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయిందనుకుంటే పొరపాటే! ఇప్పటికీ పాజిటివిటీ రేటు 2.5-3 శాతం మధ్య నమోదవుతోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని, కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్ కేసులూ భయపెడుతున్నాయి. ప్రజలు ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని...కొవిడ్ మనల్ని వదిలి పోలేదన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, లేకపోతే మహమ్మారి మళ్లీ ఏ క్షణంలోనైనా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్త తప్పదు!
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరు తమకు కరోనా సోకదన్న ధీమాతో జాగ్రత్తలు పాటించడం లేదు. అలాంటి వాళ్లు 10-15 శాతం ఉంటారని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకకుండా వ్యాక్సిన్ అడ్డుకోదని, వైరస్ సోకినా వ్యాధి తీవ్రంగా మారకుండా రక్షణ కల్పిస్తుందని వారంటున్నారు. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారిలోనూ కొందరు కరోనా సెకండ్వేవ్ సమయంలో వైరస్బారినపడి ఆసుపత్రిలో చేరిన ఉదంతాలు ఉన్నాయి. పైగా రాష్ట్రంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవలసినవారు చాలా మంది ఉన్నారు.
మరిస్తే ముప్పే!
• మంచి మాస్కు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, అవసరం లేకుండా ప్రయాణాలు చేయకపోవడం, విందులు, వినోదాలకు వెళ్లకపోవడం... మొదటి నుంచీ చెబుతున్న జాగ్రత్తలివే. ఇప్పటికీ అవే మౌలిక సూత్రాలు.
• మనతో పాటు మన పక్కవాళ్లు కూడా మాస్కుపెట్టుకుంటే 95 శాతం వరకు రక్షణ లభిస్తుంది.
• వైద్య పరీక్షలు, చికిత్సల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు రెండు మాస్కులు ధరించాలి.
• కొందరు మాస్కుని నోటికి మాత్రమే పెట్టుకుని, ముక్కుని వదిలేస్తున్నారు. అలా చేస్తే ముప్పు పొంచే ఉంటుంది.
• వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఒకేసారి ఎక్కువ మంది గుమికూడటమూ కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశముంది.
థర్డ్వేవ్ని మనమే ఆహ్వానించేలా ఉన్నాం
‘‘కరోనా థర్డ్వేవ్ కచ్చితంగా రావాలనేమీ లేదు. అది వచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని మనమే సృష్టిస్తున్నాం. కరోనా ఇప్పటికే రావాల్సిన వాళ్లకు వచ్చేసింది, ఇక మనకు రాదులే అన్న భావనలో కొందరు ఉన్నారు. కొవిడ్ అంత ప్రమాదకరమేమీకాదన్న మొండి ధైర్యం కొందరిలో పెరిగింది. ముఖ్యంగా యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్ల ఇంట్లో పెద్దలకూ ముప్పు పొంచి ఉంది’’ - డాక్టర్ రామనరసింహం, సీనియర్ ఫిజీషియన్
మన వరకు రాదనుకునే మనస్తత్వంతో ప్రమాదం
‘‘ఉష్ట్రపక్షి ఏదైనా ప్రమాదాన్ని శంకించినప్పుడు ఇసుకలో తల దాచుకుని తనకేమీ కాదనుకుంటుందని చెబుతారు. కొందరు మనుషుల్లోను ఇలాంటి ‘డినైయింగ్’, ‘ఎస్కేపింగ్’ ధోరణి ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా విపత్తు వస్తుందేమోగానీ, తమ వరకు రాదన్న భావన వారిలో ఉంటుంది. ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నా కూడా... కొందరు జాగ్రత్తలు పాటించకపోవడానికి ఆ టెండెన్సీనే కారణం. పైగా తాము చేసే పనిని వారు సమర్థించుకుంటారు. మనుషుల్లో ఇంటిలెక్చువల్ ఇన్సైట్, ఎమోషనల్ ఇన్సైట్ అని రెండు రకాలు ఉంటాయి. అవి రెండూ సమతూకంలో ఉంటేనే... ప్రవర్తన సరిగా ఉంటుంది. మాస్కు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని మెదడు చెప్పినా... దాన్ని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన భావోద్వేగపూరిత దృష్టి లేకపోతే అమలు చేయరు’’ - కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు