Punjab: సరిహద్దు గ్రామంలో పాక్‌ బెలూన్ల కలకలం

పంజాబ్‌లోని పాక్‌ సరిహద్దులో ఉన్న గ్రామంలో ‘ఐ లవ్‌ పాకిస్థాన్‌’ అని రాసి ఉన్న బెలూన్లు, పాక్‌ జాతీయ పతాకం కలకలం సృష్టించాయి.

Published : 16 Aug 2021 11:55 IST

పంజాబ్‌లోని పాక్‌ సరిహద్దులో ఉన్న గ్రామంలో ‘ఐ లవ్‌ పాకిస్థాన్‌’ అని రాసి ఉన్న బెలూన్లు, పాక్‌ జాతీయ పతాకం కలకలం సృష్టించాయి. రూప్‌నగర్‌ జిల్లా సనోడా గ్రామంలోని పొలాల్లో ఆదివారం ఇవి కనిపించాయి. పాకిస్థాన్‌ నుంచి వీటిని వదులుతున్నట్టు భావిస్తున్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఎక్కడినుంచి, ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని రూప్‌నగర్‌ సీనియర్‌ ఎస్పీ డాక్టర్‌ అఖిల్‌ చౌదరి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని