అఫ్గాన్కు సాగునీటి ప్రాజెక్టు కట్టిచ్చాం: కేంద్ర జల సంఘం డైరెక్టర్ రమేశ్కుమార్
అనేక ఇబ్బందులు ఎదుర్కొని అఫ్గానిస్థాన్లో భారత్ సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ఇచ్చిందని కేంద్రజల సంఘం డైరెక్టర్ ఎం.రమేశ్కుమార్ తెలిపారు. ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.1,775 కోట్లతో మన దేశం సల్మా ప్రాజెక్టును కట్టిందని వివరించారు...
భారత్ రూ.1,775 కోట్ల వ్యయం చేసింది
భయంభయంగా పనుల పర్యవేక్షణ
ఆ దేశంలో తన అనుభవాలు ‘ఈనాడు’కు వివరించిన కేంద్ర జల సంఘం డైరెక్టర్
ఎంఎల్ నరసింహారెడ్డి, ఈనాడు- హైదరాబాద్
భద్రతా బలగాల నిఘా మధ్య హెరత్ నుంచి సల్మా ప్రాజెక్టుకు వెళ్తున్న రమేశ్కుమార్
అనేక ఇబ్బందులు ఎదుర్కొని అఫ్గానిస్థాన్లో భారత్ సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ఇచ్చిందని కేంద్రజల సంఘం డైరెక్టర్ ఎం.రమేశ్కుమార్ తెలిపారు. ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.1,775 కోట్లతో మన దేశం సల్మా ప్రాజెక్టును కట్టిందని వివరించారు. అక్కడ విద్యుదుత్పత్తి మన పుణ్యమే అన్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వెళ్లేవారిమని, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉండేదని అయన పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్లో ఉన్నత విద్య చాలా తక్కువ అని.. ప్రాజెక్టు నిర్వహణ కోసం అక్కడి వారు 20 మందిని ఎంపిక చేసి రూర్కీలో ఇంజినీరింగ్ చదివించి శిక్షణ ఇచ్చామన్నారు. ఆ ప్రభుత్వ విన్నపం మేరకు మరో ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసిందన్నారు. మొదటి ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో భాగంగా, రెండో ప్రాజెక్టు డీపీఆర్ తయారీ సందర్భంగా పలుసార్లు అక్కడ పర్యటించిన రమేశ్కుమార్... అఫ్గాన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ‘ఈనాడు’తో తన అనుభవాలను పంచుకున్నారు.
మహిళలు పనిచేసేవాళ్లు కాదా?
నిర్మాణంలో మహిళా కార్మికులు జీరో. ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నప్పుడు మార్గంలో దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అక్కడక్కడ గాడిదలపై వెళ్తూ కనిపించేవాళ్లు. మహిళలు, పిల్లలు గాడిదలపై కూర్చుంటే, మగవాళ్లు వాటి వెనక నడుస్తూ ఉండేవాళ్లు. అక్కడ ఎందుకూ పనికిరాని భూములెక్కువ. ఎటు చూసినా ఏమీ కనిపించదు. దానిమ్మ, ఖర్జూర తోటలతో పాటు మొక్కజొన్న అక్కడక్కడా కనిపించేవి. ఎక్కువ మంది రొట్టెలు కొనుక్కొని ఇంట్లో కూర వండుకుని తింటారు. రొట్టెలు చాలా గట్టిగా ఉంటాయి. కొంతసేపు కూరలో నానబెట్టి మెత్తగా అయిన తర్వాత తినేవాళ్లు. మనదగ్గర షాపుల్లో డాలర్లు ఇస్తే తీసుకోరు. కానీ అక్కడ స్థానిక కరెన్సీ కంటే డాలర్లు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. దీనికి మారకం విలువ ఎక్కువని. అక్కడ షాపుల్లో గన్లు, బుల్లెట్లు బహిరంగంగానే అమ్ముతుంటారు.
సాంకేతిక నిపుణులంతా ఇండియా నుంచే అంటే అక్కడ అసలు లేరా?
ఉన్నత విద్య చాలా తక్కువ. దీనివల్ల నిర్మాణ సమయంలోనే కాదు, పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా సాంకేతిక నిపుణుల సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివేందుకు సౌకర్యాలు చాలా తక్కువ.. పారిపోయి పక్కదేశాలకు వెళ్లి కొంత చదువుకొని పరిస్థితి సద్దుమణిగాక తిరిగి వచ్చిన వాళ్లలో కొంత మెరుగ్గా ఉన్న 20 మందిని ఎంచుకొని కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ రూర్కీలో 2010లో చేర్పించారు. 2014లో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వీరి ఇంజినీరింగ్ అయ్యేలా చూశారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత విద్యుత్తు ప్రాజెక్టుల్లో కూడా శిక్షణ ఇచ్చి పంపారు.
నిర్మాణంలో పాలుపంచుకొన్న వాళ్లంతా అఫ్గానిస్థాన్ వారేనా?
కార్మికులు పూర్తిగా అఫ్గానిస్థాన్కు చెందిన వారే. సాంకేతిక నిపుణులు మనదేశంవారు. డిజైన్ల బాధ్యత కేంద్రజలసంఘ ఇంజినీర్లది. మనం నెలనెలా కనీస వేతనాలు ఇచ్చే వాళ్లం. అక్కడ ప్రభుత్వంలో ఉండేవాళ్లకు మూడు,నాలుగు నెలలకోసారి కూడా జీతాలు వచ్చేవికాదు. దీంతో ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు అనేకమంది ప్రాజెక్టు నిర్మాణంలో పని చేశారు. బాగా కష్టపడేవారు.
ఎంత ఆయకట్టుకు నీరందుతుంది?
ఈ ప్రాజెక్టు ద్వారా 75వేల హెక్టార్లకు సాగునీరందించడంతో పాటు 42 మెగావాట్ల విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది. అంతకు ముందు అఫ్గానిస్థాన్లో విద్యుదుత్పత్తి జీరో. ఇతర దేశాల నుంచి కొని తెచ్చుకొని పట్టణాల్లో కొంతవరకు మాత్రమే సరఫరా చేసేవారు. దీంతో ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ఎంతో ఉపయోగపడింది. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం జనరేటర్ల సాయంతోనే జరిగింది. సిమెంటు, స్టీలు కూడా వేర్వేరు దేశాల నుంచి వచ్చేవి. అన్నీ ఒక రకంగా ఉండేవి కాదు. దీంతో ప్రతి ఒక్కటీ పరీక్షించాల్సి వచ్చేది. అక్కడ ల్యాబ్లు లేవు కాబట్టి ఇక్కడికి తెచ్చి చేసే వాళ్లం. విద్యుదుత్పత్తికి బి.హెచ్.ఇ.ఎల్ టర్బైన్లు ఇరాన్ పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించేవాళ్లం. టిప్పర్లనీ అంతే. అక్కడ విద్యుత్తు లేకపోవడంతో పరిశ్రమలు కూడా లేవు.
కొత్తగా మరో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు కదా, ఏమైంది?
కాబుల్లో జనాబా ఎక్కువ. భూగర్బజలాలపైనే ఆధారపడాలి. దీంతో భూగర్భజలమట్టం 120 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లింది. నీటి సరఫరా లేదు. దీంతో ఇక్కడ ఒక ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని భారత్కు విజ్ఞప్తి చేశారు. నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేశాం. మన ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. తర్వాత అక్కడి పరిణామాలతో ఆగిపోయింది.
అఫ్గానిస్థాన్లో భారత్ నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టు వివరాలేంటి?
హెరత్ ప్రొవిన్స్లోని హురిద్ నదిపై సల్మాడ్యాం ప్రాజెక్టును భారత్ నిర్మించి ఇచ్చింది. 1976లో దీని నిర్మాణం ప్రారంభమైంది. కొంత పని జరిగాక 1979లో సోవియట్ ఆక్రమణతో ఆగిపోయింది. 1988లో మళ్లీ ప్రారంభమైనా ముందడుగు పడలేదు. 2006లో మళ్లీ చేపట్టారు. భారత ప్రభుత్వం రూ.1,457 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వాప్కోస్కు అప్పగించారు. టెండర్లు పిలవగా భారత్కు చెందిన నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బెంగళూరుకు చెందిన సల్మాడ్యాం జాయింట్ వెంచర్ ఈ పనిని దక్కించుకుంది. 107 మీటర్ల ఎత్తుతో ఎర్తెన్ రాక్ఫిల్డ్యాం, మూడు గేట్లతో స్పిల్వే నిర్మాణం. 2010 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం కాగా.. 2015 జులై 26కు పూర్తయ్యింది. 2016 జూన్4న మన ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. దీనికి ఇండియా-అఫ్గానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యాం అని పేరు పెట్టారు. పూర్తయ్యేటప్పటికి మొత్తం రూ.1,775 కోట్ల వ్యయమైంది.
తాలిబన్ల వల్ల ప్రాజెక్టు పనులకు అడ్డంకి కలగలేదా?
నిర్మాణ ప్రాంతంలో భారీ పోలీసు యూనిట్ ఉండేది. ఎక్కడికి వెళ్లినా మాతోపాటు కనీసం 20 వాహనాలు సెక్యూరిటీగా వచ్చేవి. కాబుల్ నుంచి హెరత్ ప్రొవిన్స్ 300 కి.మీ. అక్కడికి వెళ్లాలంటే కాందహార్ మీదుగా వెళ్లాలి. అది చాలా ప్రమాదం. అందుకని హెరత్ వరకు వాయుమార్గంలో వెళ్లి అక్కడి నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న సల్మా ప్రాజెక్టుకు వెళ్లేవాళ్లం. ఆ రోడ్లలో తిని బయలుదేరితే వాంతులు చేసుకోకతప్పదు.. అంత అధ్వానంగా ఉంటాయి. బిస్కెట్లు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకోవడానికి మధ్యలో ఒకటి రెండు తినేవాళ్లం. టయోటా కార్లు తప్ప వేరేవి ఉండేవి కాదు. ఆ ప్రాంతంలో ఆధిపత్యం సాధించిన వ్యక్తిని వార్లార్డ్ అనేవారు. ఇతని కిందనే అతను ఎంపిక చేసుకొన్న యూనిట్ ఉండేది. వాళ్లే పోలీసులు. వార్లార్డ్ మాతో వస్తున్నారంటే ఏదో జరుగుతుందనే భయం ఉండేది. ఒకసారి ప్రత్యక్షంగా కాల్పుల ఘటన చూశాం. పనుల పర్యవేక్షణకు పోయి తిరిగి వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ గడపడమే. 2013లో తాలిబన్లు ఈ ప్రాజెక్టును పేల్చడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం అడ్డుకోగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా