Afghanistan: భారతీయుల తరలింపులో ఇబ్బందులు
అఫ్గానిస్థాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడమే తమ ముందు ఉన్న
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూయార్క్, మాస్కో: అఫ్గానిస్థాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడమే తమ ముందు ఉన్న తక్షణ లక్ష్యమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశానికి అధ్యక్షత వహించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాబుల్ విమానాశ్రయం పరిస్థితి ఏమిటన్నది తెలియకపోవడంతో భారతీయులను తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. అఫ్గానిస్థాన్లోని మజర్-ఎ-షరీఫ్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించే రెండు రోజుల ముందే అక్కడ ఉన్న 50 మంది భారత కాన్సులేట్ సిబ్బందిని భారత వాయుసేన విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చారు. తాలిబన్లు దాడులు చేస్తారని అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమయింది. కాందహార్లోని కాన్సులేట్ సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా కాబుల్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న మొత్తం రాయబార కార్యాలయ ఉద్యోగులను ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చారు. కాబుల్ను తాలిబన్లు ఆక్రమించిన తరువాత కూడా మరో 180 మందిని తెచ్చారు. ఇంకా అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి స్థానిక అధికారులు, అమెరికా భద్రత దళాల సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాలు దిగడానికి అనుమతి లభిస్తేనే ఇది సాధ్యం కానుండడంతో ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారు. అఫ్గాన్ పరిస్థితిపై బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్తో జైశంకర్ చర్చలు జరిపారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, తదితర విషయాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఆకలి కేకలు తప్పవు: ఐరాస
అనిశ్చితి పరిస్థితుల కారణంగా అఫ్గాన్లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కనీసం 1.40 కోట్ల మంది తీవ్రమైన ఆకలి బాధను ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ ఆహార కార్యక్రమం డైరెక్టర్ మేరీ ఎల్లెన్ మెక్ గ్రోర్తీ మాట్లాడుతూ ‘‘కరవు కారణంగా దేశంలో 40 శాతం పంటలు పోయాయి. పెద్ద సంఖ్యలో పశువులు చనిపోయాయి. తాలిబన్ల రాకతో వేలాది మంది చెల్లాచెదురయ్యారు. శీతకాలం కూడా సమీపిస్తుండడంతో పంటలు వేయడానికి అనువైన సమయం కూడా కాదు. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడనుంది. ఆహారం అందించడానికి పరుగు మొదలవాలి’’ అని వ్యాఖ్యానించారు.
రుణాలు ఇవ్వం: ఐఎంఎఫ్
అఫ్గానిస్థాన్కు ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. కొత్త ప్రభుత్వాన్ని అన్ని దేశాలు గుర్తించి, స్పష్టత వచ్చే వరకు ఆర్థిక సాయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొంది.
రహస్య సంభాషణలు కొనసాగించాం: రష్యా
తాలిబన్లతో దీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగించామని, అందుకే ఇప్పుడు వారి మద్దతు పొందామని రష్యా తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ‘‘తాలిబన్లతో గత ఏడేళ్లుగా రహస్య సంభాషణలు కొనసాగించాం. అందుకే వారి మద్దతు పొందుతున్నాం. కాబుల్ను వారు ఆక్రమించుకున్నప్పుడు అన్ని దేశాలూ రాయబార కార్యాలయాలను మూసివేశాయి. మేం మాత్రం అలా చేయలేదు. మా రాయబారి వెళ్లి వారితో మాట్లాడారు. కార్యాలయానికి భద్రత కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఫరవాలేదు.. మంచి కుర్రాళ్లే’’ అని తాలిబన్లను ఉద్దేశించి కాబుల్లో రష్యా రాయబారి దిమిత్రీ ఝిర్నోవ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
గుర్తింపు ఇవ్వడంలో తొందరపడం
తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడంలో తొందరపడబోమని రష్యా విదేశాంగ మంత్రి చెప్పారు. మొత్తం అఫ్గాన్ వారి ఆధ్వర్యంలోకి రాలేదన్న విషయాన్ని తాలిబన్లు గుర్తించాలని తెలిపారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి, శాంతి నెలకొల్పాలని సూచించారు.
ప్రపంచానికి ఉగ్రవాదుల ముప్పు
బ్రిటన్ రక్షణ మంత్రి హెచ్చరిక
లండన్: అఫ్గానిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వ్యాలెస్ హెచ్చరించారు. ముఖ్యంగా అల్ఖైదా ముష్కరులు దీనిని అవకాశంగా మలచుకొని బలపడే ప్రమాదం ఉందని తెలిపారు. అభివృద్ధి సాధించలేని దేశాల్లో పేదరికం విజృంభిస్తుందని, ఉగ్రవాదం బలపడడానికి, విస్తరించడానికి ఇదే ప్రధాన వనరుగా మారుతుందన్నారు. ఇస్లామిక్ మత తత్వవాదులు అఫ్గానిస్థాన్ పరిణామాలను తమ విజయంగా ప్రచారం చేసుకుంటారని, ఇది ఇతర ఉగ్రవాద ముఠాలకు ప్రేరణగా మారుందని అభిప్రాయపడ్డారు. కాబుల్ విమానాశ్రయం నుంచి బ్రిటిష్ పౌరులు, దౌత్య సిబ్బంది, సహాయపడిన అఫ్గాన్ల తరలింపు కొనసాగుతోందన్నారు. నిత్యం 7 నుంచి 10 వరకు రాయల్ ఎయిర్ఫోర్స్ విమానాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ