చెప్పాపెట్టకుండా కాబుల్కు.. ప్రత్యేక విమానంలో వెళ్లిన ఇద్దరు అమెరికా చట్టసభ్యులు
కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతున్నవేళ అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు కాబుల్ విమానాశ్రయాన్ని ఆకస్మికంగా సందర్శించడం తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది....
సమాచారమివ్వకుండా పర్యటించడంపై శ్వేతసౌధం, సైన్యం ఆగ్రహం
వాషింగ్టన్: కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతున్నవేళ అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు కాబుల్ విమానాశ్రయాన్ని ఆకస్మికంగా సందర్శించడం తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముందుగా సమాచారమివ్వకుండానే వారు చేపట్టిన ఈ పర్యటనపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెథ్ మౌల్టన్ (డెమెక్రాట్), పీటర్ మీయర్ (రిపబ్లికన్) ప్రత్యేక విమానంలో మంగళవారం ఆకస్మికంగా కాబుల్ విమానాశ్రయానికి వెళ్లారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. విదేశీ పౌరులు, శరణార్థుల తరలింపు చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. మౌల్టన్, మీయర్ ఇద్దరూ గతంలో సైన్యంలో పనిచేసినవారే. ప్రస్తుతం ప్రతినిధుల సభకు సంబంధించిన సాయుధ సేవల కమిటీలో మౌల్టన్, విదేశీ వ్యవహారాల కమిటీలో మీయర్ సభ్యులుగా ఉన్నారు. అయితే- వారు చెప్పాపెట్టకుండా కాబుల్కు రావడంపై అమెరికా సైన్యం, విదేశాంగ శాఖ, శ్వేతసౌధం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చట్టసభ్యుల ప్రత్యేక విమానం నగరంలోకి ప్రవేశించడానికి కేవలం కొన్ని క్షణాల ముందే వారి పర్యటన గురించి తమకు సమాచారం అందిందని సైన్యం తెలిపింది. ఈ పర్యటన వల్ల ఇతరుల తరలింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తాయని పేర్కొంది.
తాలిబన్లు సహకరించాలి: బైడెన్
అఫ్గాన్ నుంచి విదేశీయులు, శరణార్థులను ఈ నెల 31లోగా బయటకు తరలించేందుకు తాము కృషిచేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే తాలిబన్లు సహకరిస్తేనే గడువులోగా ఆ చర్యలు పూర్తవుతాయని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారు కాబుల్ విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా తాలిబన్లు సహకరించాలని సూచించారు. తరలింపు చర్యలు ఆలస్యమయ్యే కొద్దీ అఫ్గాన్ గడ్డపై తమ బలగాలకు ముప్పు పెరుగుతుందన్న సంగతి తనకు తెలుసునన్నారు. ఐఎస్ఐఎస్-కె (ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ) వంటి ఉగ్ర సంస్థలు అక్కడ దాడులకు కుట్ర పన్నే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘జి-7 సమావేశాలకు భారత్ను ఆహ్వానించాలి’
అఫ్గాన్ సంక్షోభంపై తమ కూటమి నిర్వహించబోయే సమావేశాలకు భారత్ను ఆహ్వానించాలని జి-7 దేశాలకు చెందిన పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డారు. అమెరికా సెనేటర్ బాబ్ మెనెండెజ్తో పాటు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఐరోపా సమాఖ్య (ఈయూ)కు చెందిన పలువురు నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అఫ్గాన్ నుంచి అమెరికా, దాని మిత్రపక్షాలు బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ.. సీమాంతర ఉగ్రవాదంపై ఇకముందు కూడా పోరాటం కొనసాగిస్తామని అందులో స్పష్టం చేశారు.
తనిఖీలు లేకుండానే తరలింపులా?: బైడెన్పై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తనిఖీలు లేకుండానే అఫ్గాన్ నుంచి చాలామందిని విమానాల్లో బయటకు తరలిస్తుండటాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే వేల మంది ఉగ్రవాదులు ఈ తరలింపుల్లో భాగంగా విదేశాలకు చేరుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అఫ్గాన్ను ఉగ్రవాదులకు అప్పగించారు. అమెరికా పౌరులను అక్కడి నుంచి తీసుకురావడానికి ముందే బలగాలను ఉపసంహరించడం దారుణమైన విషయం. తద్వారా వేల మంది అమెరికన్ల ప్రాణాలను ఆయన ప్రమాదంలోకి నెట్టారు. ఇప్పటివరకు నాకు అందిన లెక్కల ప్రకారం.. అఫ్గాన్ నుంచి ఇటీవల 26 వేల మందిని బయటకు తీసుకురాగా.. వారిలో కేవలం 4 వేల మందే అమెరికన్లు. ఎన్ని వేల మంది ఉగ్రవాదులు అఫ్గాన్ నుంచి విదేశాలకు చేరుకొని ఉండొచ్చో దీన్నిబట్టి మనం ఊహించుకోవచ్చు. తనిఖీలు లేకుండా తరలింపులు చేపట్టడం ఘోర వైపల్యమే’’ అని ట్రంప్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు- మిలటరీ, నిఘావర్గాల సలహాలను ఖాతరు చేయకుండా అఫ్గానిస్థాన్లో సంక్షోభానికి బైడెన్ కారణమయ్యారని రిపబ్లికన్ పార్టీ శాసనకర్త మైక్ వాల్ట్జ్ ఆరోపించారు. బైడెన్ తీరును ఖండిస్తూ ప్రతినిధుల సభలో ఆయన ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్