Afghanistan: నాడు బైడెన్ను కాపాడి.. నేడు బిక్కుబిక్కుమంటూ!
అఫ్గానిస్థాన్లో తరలింపు చర్యలను అమెరికా బలగాలు హడావుడిగా ముగించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి.
తనను రక్షించాలని అఫ్గానీ అనువాదకుడి మొర
కాబుల్: అఫ్గానిస్థాన్లో తరలింపు చర్యలను అమెరికా బలగాలు హడావుడిగా ముగించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్లో ఏళ్ల పాటు తమకు సేవలందించిన పలువుర్ని అక్కడే వదిలేసి వెళ్లిన అగ్రరాజ్యం.. ప్రస్తుతం తమ దేశాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ను ఒకప్పుడు కాపాడిన స్థానికుడినీ శరణార్థిగా తీసుకెళ్లకపోవడం గమనార్హం. సెనేటర్గా ఉన్నప్పుడు 2008లో బైడెన్ అఫ్గాన్ పర్యటనకు వెళ్లారు. రెండు హెలికాప్టర్లలో ఆయన బృందం ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. దీంతో హెలికాప్టర్లను అత్యవసరంగా ఓ మారుమూల లోయలో దించారు. ఆ వెంటనే భద్రత దళాలకు సమాచారం అందింది. అయితే ఆ మారుమూల ప్రాంతానికి చేరుకోవడం బలగాలకు కష్టమైంది. అప్పుడు మహమ్మద్ అనే ఓ అనువాదకుడు వారికి సహాయం చేశాడు. ప్రతికూల వాతావరణంలో, కొండ ప్రాంతాలను దాటి లోయను చేరుకునే మార్గం చూపాడు. ఫలితంగా బలగాలు బైడెన్ను, ఆయన బృందాన్ని రక్షించగలిగాయి. నాడు మహమ్మద్ చేసిన సహాయాన్ని పలువురు అమెరికా అధికారులు ప్రశంసించారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. గతంలో అగ్రరాజ్య బలగాలకు సహాయం చేసినందుకుగాను తనను, తన కుటుంబాన్ని తాలిబన్లు చంపేస్తారేమోనని మహమ్మద్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ఈ వ్యవహారంపై శ్వేతసౌధం స్పందించింది. మహమ్మద్ను రక్షిస్తామని హామీ ఇచ్చింది. అతడి కుటుంబాన్ని బయటకు తీసుకొస్తామని శ్వేతసౌధం ప్రెస్సెక్రటరీ జెన్ సాకి చెప్పారు.
బగ్రామ్ వైమానిక స్థావరంపై చైనా కన్ను!
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆ దేశంలోని కీలక బగ్రామ్ వైమానిక స్థావరంపై చైనా కన్నేసే అవకాశముందని అమెరికాకు చెందిన మాజీ దౌత్యవేత్త నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఆ స్థావరం డ్రాగన్కు చిక్కకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా హేలీ గతంలో పనిచేశారు. తాజాగా ఆమె విలేకర్లతో మాట్లాడారు.
కాబుల్లో భేటీకి మేం సిద్ధం
బీజింగ్: అఫ్గానిస్థాన్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా తమతో పాటు అమెరికా, పాకిస్థాన్లను కలుపుకొని కాబుల్లో త్వరలోనే సమావేశం నిర్వహించేందుకు రష్యా చేసిన ప్రతిపాదనపై చైనా సానుకూలంగా స్పందించింది. అఫ్గాన్లో శాంతిస్థాపనకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని ఉద్ఘాటించింది.
సరిహద్దులు మూసుకున్న పాక్!
ఇస్లామాబాద్: అఫ్గాన్ తాలిబన్లను వెనకేసుకొస్తున్న పాకిస్థాన్... ఆ దేశం నుంచి శరణార్థులెవరూ తమ భూభాగంలో ప్రవేశించకుండా కీలక సరిహద్దులను మూసివేసింది! భద్రత కారణాలతో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని తోఖ్రాం సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేసింది. గురువారం ఉదయం అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ- భద్రత కారణాల రీత్యా చమన్ క్రాసింగ్ను కొద్ది రోజులపాటు మూసి ఉంచుతామన్నారు. దీన్ని మళ్లీ ఎప్పుడు తెరుస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. సరిహద్దుల్లో తమ భద్రత సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారని, దేశ పరిరక్షణకు వారు ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పారు. అఫ్గాన్లో శాంతి, సుస్థిరతలను పాకిస్థాన్ కోరుకుంటోందన్నారు.
తాలిబన్లను ‘గుర్తించేందుకు’ తొందరేం లేదు :అమెరికా
అఫ్గానిస్థాన్లో తాలిబన్లను అధికారిక పాలకులుగా గుర్తించేందుకు తొందరేం లేదని అమెరికా పేర్కొంది. వారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా? పాలనలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తారా? అనేవి మున్ముందు పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. తాలిబన్ల భవిష్యత్ చర్యలను బట్టే.. వారికి గుర్తింపునిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జాన్ సాకి బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు పలు విషయాలు వెల్లడించారు. తమ ప్రయోజనాల నిమిత్తం అవసరమైనప్పుడల్లా ఇకముందు కూడా తాలిబన్లతో చర్చలు జరుపుతామని అమెరికా స్పష్టం చేసింది.
‘మారారో లేదో చూడాలి’
తాలిబన్ ముఠా సభ్యులు గతంలో అత్యంత క్రూరంగా వ్యవహరించేవారని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లె చెప్పారు. వారు మారారా? లేదా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్