Covid: కొవిడ్ బాధిత చిన్నారుల్లో ఊపిరితిత్తులు పదిలమే!
కొవిడ్-19 ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్ఫెక్షన్. అయితే మహమ్మారి వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఈ అవయవ పనితీరు పెద్దగా దెబ్బతినడంలేదనే సానుకూలాంశాన్ని ..
లండన్: కొవిడ్-19 ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్ఫెక్షన్. అయితే మహమ్మారి వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఈ అవయవ పనితీరు పెద్దగా దెబ్బతినడంలేదనే సానుకూలాంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉబ్బస వ్యాధి ఉన్నవారిలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించిందని తెలిపారు. అయితే వీరు ఒక సెకనులో గట్టిగా బయటకు వదలగలిగే గాలి పరిమాణం ఒకింత తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ వివరాలను ‘యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్’ కార్యక్రమంలో విడుదల చేశారు. తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ బారినపడినవారిని మినహాయిస్తే పిల్లలు, కౌమారప్రాయుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినలేదని తేల్చారు. ‘‘ఇన్ఫెక్షన్ తగ్గాక ఊపిరితిత్తులపై మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు చెలరేగాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న చిన్నవయస్కుల విషయంలో ఈ సందేహాలు ఎక్కువగా వచ్చాయి’’ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకురాలు ఇదా మోగెన్సెన్ చెప్పారు. ఈ అధ్యయనంలో 661 మందిపై పరిశోధన జరిపారు. వీరి నుంచి ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన కీలక పరామితులు, ఇన్ఫ్లమేషన్, తెల్ల రక్తకణాలను పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.