- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
UP Elections: యూపీ ఎన్నికల ప్రచారాస్త్రం అయోధ్యే!
సిద్ధమవుతున్న పార్టీలు
లఖ్నవూ: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్ప్రదేశ్లో అయోధ్యే కీలకమైన ప్రచారాస్త్రం కానుంది. బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ప్రచారంలో అయోధ్య రామాలయమే ముఖ్యమైన అంశంగా నిలుస్తుందనే సంకేతాలు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధే మిగిలి ఉంది. భాజపా, ఎస్పీ, బీఎస్పీ సహా పలు పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఈ అంశంతోనే ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం అయోధ్య అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు. అయోధ్యలో రామాలయం తమకి ఎప్పటికీ ముఖ్యమేనని, దానిని ఎన్నికల కోణంలో చూడడం లేదని భాజపా యూపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా చెబుతున్నారు. దళితులు, బ్రాహ్మణుల మద్దతు పొంది 2007 మాదిరి విజయాన్ని మరోసారి సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆశపడుతోంది. ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య అంశంతో ప్రారంభించడానికి కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండేలా ఉంది. దీని బదులు యూపీలో అన్ని గ్రామాలు, పట్టణాల మీదుగా 12,000 కి.మీ. మేర ప్రతిజ్ఞ యాత్రను ఆ పార్టీ చేపట్టనుంది.
ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించనున్న కాంగ్రెస్
రాయ్బరేలీ: యూపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల్ని వీలైనంత ముందుగానే ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలిపారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు ఆదివారం ఆమె శ్రీకారం చుట్టారు. తొలుత హనుమాన్ మందిరంలో పూజలు జరిపారు. అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడం గురించి కార్యకర్తల సమావేశంలో ప్రియాంక వెల్లడించారని పార్టీ నాయకుడొకరు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: దిల్లీ, ముంబయిలో పెరుగుతోన్న కొత్త కేసులు..!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 న్యూస్
-
Crime News
Hyderabad News: రూ.8 వేలిస్తే.. రూ.50 వేలు
-
Ap-top-news News
Tirumala: అనుచరుల కోసం గంటకుపైగా ఆలయంలోనే మంత్రి రోజా
-
Ap-top-news News
AB Venkateswara Rao: హైకోర్టు ఆదేశించినా జీతభత్యాలు ఇవ్వలేదు
-
Ts-top-news News
Rains: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్వాచ్
- Dengue: మీ పిల్లలకు డెంగీ జ్వరమా..? ఆందోళన అసలే వద్దు..!