నాకొక ప్రియురాలు కావాలి!.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

తనకు ప్రియురాలు దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా శాసనసభ్యుడికి లేఖ రాశాడు. 

Updated : 15 Sep 2021 10:44 IST

సాధారణంగా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటేనే ప్రజాప్రతినిధులకు ప్రజలు లేఖలు రాస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు మాత్రం తనకు ప్రియురాలు దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా శాసనసభ్యుడికి లేఖ రాశాడు. ఆ మేరకు చంద్రపుర్‌ జిల్లాకు చెందిన భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌ పేరిట రాజౌరా ఎమ్మెల్యే సుభాష్‌ ధోతేకు లేఖ అందింది. ‘‘తాలుకాలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. గద్‌చందూర్‌ నుంచి రాజౌరా మధ్య రోజూ ప్రయాణిస్తుంటాను. భవిష్యత్తులో నాకు ప్రియురాలు దొరుకుతుందన్న నమ్మకం కూడా పోతోంది. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటి వాళ్లకు ప్రియురాలు దొరకట్లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న యువతులను ప్రోత్సహించండి’’ అని భూషణ్‌ తన లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఈ లేఖ ఓ కార్యకర్త ద్వారా సుభాష్‌ ధోతేకు చేరింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడి గురించి ఆరా తీయగా ఆ పేరుతో ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో ఈ లేఖపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం అందరి దృష్టిని ఆకర్షించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ఇలా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని