Afghanistan: అబలపై ఆగని తాలిబన్ దమనకాండ.. మహిళా మంత్రిత్వశాఖ భవనం ఆక్రమణ
సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.. మైనారిటీలను పట్టించుకోలేదు.. ఒక్క మహిళకూ మంత్రి మండలిలో చోటు కల్పించలేదు..
అందులో మత ప్రచార శాఖ ఏర్పాటు
కాబుల్: సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.. మైనారిటీలను పట్టించుకోలేదు.. ఒక్క మహిళకూ మంత్రి మండలిలో చోటు కల్పించలేదు.. అని ప్రపంచమంతా విమర్శిస్తున్నా, తాలిబన్లు ఖాతరు చేయడం లేదు. తమ అరాచక పాలనను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగా.. శనివారం మరో దుశ్చర్యకు దిగారు. గత ప్రభుత్వ హయాంలోని మహిళా మంత్రిత్వశాఖ భవనంలోకి చొరబడి.. అక్కడి సిబ్బందిని బయటికి పంపేశారు. తాత్కాలిక మంత్రిమండలిని ప్రకటించినప్పుడే.. తాలిబన్లు మహిళా మంత్రిత్వశాఖ ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఇప్పుడు ఆ శాఖ భవనాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ఆ భవనంలో ప్రపంచ బ్యాంకు చేపట్టిన 100 మిలియన్ డాలర్ల మహిళా ఆర్థిక సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కోసం సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరినీ తాలిబన్లు గెంటేశారు. అందులో కొత్తగా ప్రకటించిన ధర్మ ప్రచార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయనున్నారు. ఇస్లాం చట్టాలను కఠినంగా అమలుపరచే బాధ్యత ఈ శాఖదే. ప్రత్యేక వాహనాల్లో ఈ శాఖ సిబ్బంది వీధుల్లో తిరుగుతూ... షరియా చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారిపై నిఘా వేయనున్నారు. ఒక వేళ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని అక్కడికక్కడే కొరడాలతో శిక్షిస్తారు. ఇప్పటికే ఈ వాహనాలు అఫ్గాన్లో స్వైరవిహారం చేస్తూ.. బహిరంగంగా తిరిగే మహిళలను లక్ష్యం చేసుకుంటున్నాయి.
అమ్మాయిలు ఇళ్లకే!
తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనలకు మరింత బలం చేకూర్చే విధంగా ఇటీవలే తాలిబన్లు మరో నిర్ణయం తీసుకున్నారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే తరగతులకు హాజరుకావాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అమ్మాయిల ప్రస్తావన లేదు.
తాలిబన్లతో ఇమ్రాన్ చర్చలు
ఇస్లామాబాద్: అఫ్గాన్లోని తాలిబన్ ప్రభుత్వంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చర్చలు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన శనివారం తెలిపారు. శుక్రవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశంలో తాలిబన్లు సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంపై భారత్, చైనా సహా సభ్యదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లతో ఇమ్రాన్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాలిబన్ల వాహనాలపై బాంబులతో దాడి ముగ్గురి మరణం.. 20 మందికి గాయాలు
జలాలాబాద్: అఫ్గానిస్థాన్లో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. శనివారం నంగర్హార్ ప్రావిన్స్లో తాలిబన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు. ఘటనకు ఇంకా ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు. తాలిబన్ పాలకులకు వ్యతిరేకంగా ఐఎస్.. తూర్పు అఫ్గానిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శనివారం రాజధాని కాబూల్లోనూ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు.
తప్పు మాదే.. క్షమించండి
కాబుల్లో గత నెల 29న జరిగిన డ్రోన్ దాడికి సంబంధించి అమెరికా క్షమాపణ కోరింది. నాటి దాడిలో సాధారణ పౌరులే మృతి చెందారని పేర్కొంది. తమ అంతర్గత విచారణలో పొరపాటు జరిగినట్లు తేలిందని తెలిపింది. కాబుల్ విమానాశ్రయంవైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై చేసిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మృతి చెందారని ఇప్పటివరకు అమెరికా చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ దాడిలో ఏడుగురు చిన్నారుల సహా 10మంది పౌరులు మృతిచెందినట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ