Covid Vaccine: టీకా వేసుకుంటే.. వంటనూనె, ఫోన్లు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషను (ఏఎంసీ)లో కొన్ని

Published : 11 Oct 2021 10:50 IST

అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రోత్సాహకాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషను (ఏఎంసీ)లో కొన్ని ప్రాంతాలు కొవిడ్‌-19 వ్యాక్సినేషనులో వెనుకబడి ఉండటంతో అధికారులు ప్రోత్సాహకాలు ప్రకటించి లక్ష్యసాధనకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో కొన్నిచోట్ల ఈ వెనుకబాటు కనిపించడంతో మొదటి డోసు వ్యాక్సినేషనులో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను టీకా తీసుకున్నవారికి వంటనూనె ప్యాకెట్లు అందిస్తున్నారు. లక్కీడ్రా పెట్టి రూ.10 వేల విలువ చేసే ఫోన్లు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా శనివారం పది వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేయగా.. ఆదివారం నాటికి ఆ సంఖ్య 20 వేలకు చేరింది. లక్కీ డ్రాలో 25 మంది ఫోన్లు గెలుచుకున్నట్లు ఏఎంసీ అధికారి తెలిపారు. ఈ ప్రయత్నంలో యువ అన్‌స్టాపబుల్‌ ఆర్గనైజేషన్‌ తమకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు