Afghan Crisis: అఫ్గాన్లో ఆధిపత్య పోరు
అఫ్గానిస్థాన్పై ఆధిపత్యం కోసం తాలిబన్లతో తలపడుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పెద్దఎత్తున రక్తపాతం సృష్టిస్తోంది. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లు అధికారంలో ..
కుదురుకోవడానికి తాలిబన్ల ప్రయత్నం
అస్థిరపర్చేందుకు ఐఎస్ కుట్రలు
కాబుల్: అఫ్గానిస్థాన్పై ఆధిపత్యం కోసం తాలిబన్లతో తలపడుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పెద్దఎత్తున రక్తపాతం సృష్టిస్తోంది. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లు అధికారంలో కుదురుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అస్థిరతను వ్యాపింపజేయడానికి ఐఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో దేశ రాజధాని నగరం కాబుల్లో ఐఎస్ రెండు పేలుళ్లకు తెగబడింది. కాబుల్ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు, 169 మంది అఫ్గాన్ పౌరులు మరణించారు. గత శుక్రవారం ఉత్తర రాష్ట్రం కుందుజ్లో షియాల మసీదుపై ఐఎస్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారు. ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో నిరంతరం ఏదో ఒకచోట ఐఎస్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు తాలిబన్ ముఠా సభ్యులనూ ఆ సంస్థ లక్ష్యంగా చేసుకుంటూనే ఉంది. అమెరికా, దాని మిత్రదేశాలకు ముప్పుతెచ్చే ఐఎస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద మూకలకు అఫ్గాన్ గడ్డపై స్థానం కల్పించబోమని శాంతి చర్చల్లో తాలిబన్లు అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ, ఐఎస్ దూకుడు వల్ల తాలిబన్ తన హామీలను ఎంతవరకు నిలబెట్టుకోగలదో చూడాలి.
విభేదాలకు మత మూలాలు: తాలిబన్, ఐఎస్లు రెండూ ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కట్టుబడి ఉన్నా తాలిబన్లు తమ ఇస్లామిక్ రాజ్యాన్ని అఫ్గానిస్థాన్కు పరిమితం చేస్తున్నారు. ఐఎస్ ప్రపంచ ఖలీఫా రాజ్యాన్ని నెలకొల్పుతాననీ, దాన్ని ముస్లింలు అందరూ సమర్థించాలని డిమాండ్ చేస్తోంది. తాలిబన్ల జాతీయవాదాన్ని.. స్వచ్ఛమైన ఇస్లామిక్ ఉద్యమంగా అది పరిగణించడం లేదు. అల్ ఖైదా భావాలనూ ఐఎస్ వ్యతిరేకిస్తోంది. తాలిబన్, ఐఎస్లు రెండూ కఠిన షరియా సూత్రాలకు కట్టుబడి ఉన్నా, ఐఎస్ ఏడాకులు ఎక్కువే చదివింది. సిరియా, ఇరాక్లను తన ఏలుబడిలోకి తెచ్చుకున్నప్పుడు షరియా పేరిట ఐఎస్ పలు అఘాయిత్యాలకు పాల్పడింది. 2015లో ఆ సంస్థ అఫ్గానిస్థాన్లో ఐఎస్-ఖోరాసాన్ (ఐఎస్-కె) పేరిట కార్యకలాపాలు మొదలుపెట్టింది. అఫ్గాన్, పాకిస్థాన్ ఇస్లామిక్ తీవ్రవాదులను, తాలిబన్ ఫిరాయింపుదారులను తనతో చేర్చుకుంది. తాలిబన్ దాడులు, అమెరికా విమాన దాడులు ఐఎస్-కెని బలహీనపరచినా, అమెరికా సేనల నిష్కమ్రణ తరవాత అది మళ్లీ విజృంభిస్తోంది. తాలిబన్లను అస్థిరపరచి అఫ్గానిస్థాన్ అంతటినీ కానీ, కొంత భాగాన్ని కానీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. అయితే, తాలిబన్ల మాదిరిగా ఐఎస్కు పాకిస్థాన్, ఇరాన్ల నుంచి ఆశ్రయం కానీ, ఇతరత్రా మద్దతు కానీ లభించదు. కాబట్టి అది అఫ్గాన్లో బలపడటం కష్టమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని