Crime News: సోదరుడితో కలిసి అత్తింటికి కోడలి కన్నం

మహాలక్ష్మిగా భావించే ఇంటి కోడలే.. కన్నం వేసింది. సోదరుడితో కలిసి అత్తింటిని దోచేసింది. ఆభరణాలు, నగదు కలిసి కోటి రూపాయల వరకు చోరీ చేసింది.

Published : 18 Oct 2021 13:51 IST

మహాలక్ష్మిగా భావించే ఇంటి కోడలే.. కన్నం వేసింది. సోదరుడితో కలిసి అత్తింటిని దోచేసింది. ఆభరణాలు, నగదు కలిసి కోటి రూపాయల వరకు చోరీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఈ ఘటన వెలుగుచూసింది. అక్టోబరు 13న ఘటన జరగ్గా.. ఇంటి కోడలే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. గృహోపకరణాల దుకాణం నడిపిస్తున్న అగర్వాల్‌ కుటుంబం ఇండోర్‌లో నివసిస్తోంది. తన తండ్రితో కలిసి రోహిత్‌ అగర్వాల్‌ దుకాణాన్ని చూసుకుంటున్నాడు. ఘటన సమయంలో రోహిత్‌.. తన తండ్రి, సోదరుడితో కలిసి దుకాణానికి వెళ్లాడు. రోహిత్‌ తల్లి, భార్య మాధురి, తమ్ముడి భార్య, వారి పిల్లలు ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సమయంలో రోహిత్‌ తల్లి అస్వస్థతకు గురైంది. దీంతో మాధురి.. ఇంట్లో వారితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు ఇంటి కోడలు మాధురే చోరీకి పాల్పడిందని తేల్చారు. తన సోదరుడు వైభవ్‌తో కలిసి.. దొంగతనానికి ప్రణాళిక  వేసినట్లు చెప్పారు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో తన అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు ఇంటి తలుపులను మాధురి తెరిచి ఉంచిందని పోలీసులు తెలిపారు. అనంతరం వైభవ్‌ అతడి స్నేహితుడు అర్బాజ్‌ ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని